తొలిమెట్టుకు తోడ్పాటు
ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు, అభ్యసనా ఫలితాలు రాబట్టడానికి ఈ నెల 17 నుంచి విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది.
గణిత అభ్యాస దీపికలు రూపొందించిన ఉపాధ్యాయుడు
దాత సాయంతో పంపిణీ
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు
ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు, అభ్యసనా ఫలితాలు రాబట్టడానికి ఈ నెల 17 నుంచి విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం పనిదినాలు 220 అయితే అందులో 140 రోజులు తొలిమెట్టు ప్రణాళిక అమలు చేయనున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా విద్యార్థుల్లో మౌలిక గణిత సామర్థ్యాల సాధనకు అవసరమైన పుస్తక సామగ్రిని మాత్రం పంపిణీ చేయడం లేదు. దీన్ని గమనించిన లింగంపేట మండల ఉపాధ్యాయుడు భట్టు నర్సిములు గణితం అభ్యాస దీపిక(వర్క్ బుక్) సిద్ధం చేశారు. దాత సాయంతో వాటిని ముద్రించి పంపిణీ చేస్తూ తొలిమెట్టుకు తోడ్పాటు అందిస్తున్నారు.
ఇంటి వద్ద సాధన చేయించేందుకు
జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే గట్టి పునాది వేయాలన్న ఆశయంతో తొలిమెట్టు కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పేరుతో పాఠ్యాంశాలు బోధించేలా ఉపాధ్యాయులకు తర్ఫీదునిస్తున్నారు. నిరుపేద విద్యార్థులు బడిలో చదువుకోవడం తప్ప సాయంత్రం ఇంటి వద్ద సాధన చేయించే తల్లిదండ్రులు శాతం తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో లింగంపేట మండలంలోని నెహ్రూనగర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు భట్టు నర్సిములు గణితం అభ్యాస దీపిక(ప్రాథమిక స్థాయి) రచించి గాంధారికి చెందిన వైద్యులు రాంసింగ్ సహకారంతో వెయ్యి పుస్తకాలు ముద్రించి పంపిణీ చేపట్టారు. వీటి ద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే వీలుంటందని పలు సర్వేలు నిరూపించాయి.
గణితం అభ్యాస దీపిక
గతంలో తెలుగు, ఆంగ్లంలో..
కొవిడ్ సమయంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఆన్లైన్ బోధన చేపట్టింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులను పట్టించుకోకపోవడంతో వారిలో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. దీనిని గమనించిన నర్సిములు తెలుగు, ఆంగ్లం భాషలను తేలికగా నేర్చుకునేందుకు అభ్యాస దీపికలు రూపొందించారు. ఇంతటితోనే సరిపెట్టకుండా దాతల సాయంతో వాటిని ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేశారు. చదవడం- రాయడం ద్వారానే భాషను నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో చిత్రాలతో కూడిన పుస్తకాన్ని తీర్చిదిద్ది విద్యావేత్తల ప్రశంసలు అందుకున్నారు.
సామర్థ్యాలు పెరుగుతాయి
భట్టు నర్సిములు, పుస్తక రచయిత
అభ్యసనతోనే విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతాయి. ఇందులో భాగంగానే అభ్యాస దీపికలు రూపొందించా. దాతల సహకారంతో వాటిని ముద్రించి పంపిణీ చేస్తున్నా. గణిత అభ్యాస దీపికను లింగంపేట మండలంలోని ప్రాథమిక తరగతుల విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు రూపొందించాను. మరింత మంది దాతలు ముందుకొస్తే జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు పంపిణీ చేస్తా.
విద్య.. వైద్యం రెండు కళ్లు
రాంసింగ్, ప్రముఖ వైద్యుడు
పిల్లలకు విద్య, వైద్యం రెండు కళ్లలాంటివి. ప్రాథమిక తరగతుల్లో చదువుకు గట్టి పునాది పడితే భవిష్యత్తులో తిరుగుండదు. ఏ శాస్త్రానికైనా గణితం లేకుండా పురోగతి ఉండవు. అందుకే గణిత అభ్యాస దీపిక ముద్రణకు నావంతు తోడ్పాటు అందించా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభం
[ 29-03-2024]
జిల్లా పాలనధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారం శుక్రవారం మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో విశ్వనాథం తెలిపారు. -
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!