మారనున్న పాఠాలు
దేశ విద్యా ప్రణాళిక పిల్లల అవసరాలను ప్రతిబింబించాలి. ఇందుకనుగుణంగా పాఠ్యాంశాలను మార్చాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములు....
జాతీయ పాఠ్య ప్రణాళిక అమలుపై దృష్టి
ప్రజాభిప్రాయ సేకరణ
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం
కామారెడ్డి జిల్లాకేంద్రం బతుకమ్మకుంట ప్రాథమిక బడిలో బోధన చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు
దేశ విద్యా ప్రణాళిక పిల్లల అవసరాలను ప్రతిబింబించాలి. ఇందుకనుగుణంగా పాఠ్యాంశాలను మార్చాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములు కావాలని నూతన జాతీయ విద్యావిధానం-2020 పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ ప్రక్రియ ప్రారంభమైంది.
నాలుగు విభాగాల్లో రూపకల్పన
నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రూపొందనుంది. ఇప్పటి వరకు 1975, 1988, 2000, 2005లో జాతీయ విద్యా ప్రణాళికలు అమలు పరిచారు. మార్కులు, గ్రేడింగులతో విద్యార్థులపై ఒత్తిడి పెంచారు. ప్రస్తుతం నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త ప్రణాళిక తయారు చేయాలని కేంద్ర విద్యా పరిశోధన సంస్థ, విద్యాశాఖ భావిస్తోంది. శిశు, బాలల, ఉపాధ్యాయ, వయోజన విద్య వారీగా రూపొందించనున్నారు. ఏళ్ల నాటి అస్పష్ట పాఠ్యాంశాలను తొలగించనున్నారు.
జిల్లాలో విద్యార్థులు (ప్రభుత్వ, ప్రైవేటు)
కామారెడ్డి 1.57 లక్షలు
నిజామాబాద్ 2.25 లక్షలు
ఉపాధికి ఊతమివ్వాలి : - నరేశ్, ఉపాధ్యాయుడు
కేంద్ర ప్రభుత్వం నూతన పాఠ్యప్రణాళిక చట్టం రూపొందించడం శుభ పరిణామం. ఉపాధికి ఊతమిచ్చేలా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలి. నైతిక విలువలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. పిల్లల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి.
క్షేత్రస్థాయిలో అవగాహన : - దామోదర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
నూతన జాతీయ విద్యావిధానంలో పాఠ్యప్రణాళిక అమలుపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచాలి. టీజీటీ, పీజీటీ స్థానాలను భర్తీ చేయాలి. కొత్త విధానంతో విద్యార్థులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రణాళికను అమలు చేయక తప్పదు.
11 అంశాలపై...
* నూతన ప్రక్రియ అమల్లో భాగంగా నేషనల్ కరిక్యులం ఫ్రేంవర్క్పై దేశవ్యాప్తంగా ఆన్లైన్లో 23 భాషల్లో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. - సర్వేలో భాగంగా పాఠ్యప్రణాళిక, పుస్తకాలు, బోధనోపకరణాలు తదితర అంశాలపై యాప్, వెబ్సైట్ల ద్వారా సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు.
* nvsms. sms.gov.in పోర్టల్లో తమ అభిప్రాయాలు తెలపొచ్చు.
* పాఠశాల విద్య ద్వారా విద్యార్థులు సాధించాల్సిందేంటి.. సమాజంతో సంబంధాలు, కొవిడ్ కారణంగా కలిగిన అభ్యసన నష్టం ఎలా పూడ్చాలి.. పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ఎలాంటి మార్పులు అవసరం.. తదితర 11 అంశాలపై రెండు వేల లోపు అక్షరాల్లో నమోదు చేయాలి.
* ఉమ్మడి జిల్లాలో అందరికి ఆమోదయోగ్యమైన విద్యా ప్రణాళిక అమలుకు ప్రతిఒక్కరు తోడ్పాటునందించాలని విద్యా నిపుణులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!