కలహాల కలవరం.. కవలలకు విషం
ముద్దులొలికే కవల పిల్లలు.. రోజూ పాలిచ్చి లాలించే తల్లి విషం తాగించి ఊపిరి తీసుస్తోందని ఊహించలేకపోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఓ చిన్నారి బలైంది. మరో కూతురి పరిస్థితి విషమంగా మారింది.
క్షణికావేశంలో చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
ఓ పాప మృతి.. మిగతా ఇద్దరి పరిస్థితి విషయం
న్యూస్టుడే, మాచారెడ్డి
పిల్లలతో మమత
ముద్దులొలికే కవల పిల్లలు.. రోజూ పాలిచ్చి లాలించే తల్లి విషం తాగించి ఊపిరి తీసుస్తోందని ఊహించలేకపోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఓ చిన్నారి బలైంది. మరో కూతురి పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో తానూ చావుబతుకులతో పోరాడుతోంది. ఈ హృదయవిదారక ఘటన మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడెం నవీన్, మమత దంపతులకు 11 నెలల క్రితమే ఆడ కవల పిల్లలు జన్మించారు. వారం రోజుల క్రితం రోడ్డుప్రమాదానికి గురైన నవీన్ గాయాలపాలై ఇంట్లోనే ఉంటున్నాడు. అత్తాకోడళ్లు మమత, లక్ష్మికి కుటుంబ విషయాల్లో గొడవలు జరిగేవి. శనివారం మాటామాట అనుకుంటుండగా భర్త నవీన్ కల్పించుకొని ఇద్దరినీ మందలించాడు. ఇంట్లో తరచూ గొడవలు జరగడంతోపాటు భర్త ప్రతిసారి తననే తిడుతున్నాడని మనస్తాపం చెందిన మమత పిల్లలు మహాశ్రీ, మహన్యను గదిలోకి తీసుకెళ్లింది. వారికి ఎలుకల మందు తాగించి తానూ తాగింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో కనిపించారు. హుటాహుటిన కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మహాశ్రీ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. తల్లి మమత చికిత్స పొందుతోంది. భర్త నవీన్, అత్త లక్ష్మి, మామ నారాయణ వరకట్న వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మమత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె తమ్ముడు కల్లూరి మధు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్కుమార్ పేర్కొన్నారు. డీఎస్పీ సోమనాథం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న మమతతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
మృతి చెందిన మహాశ్రీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ