కులపతి.. సమస్యలు ఆలకించి
కులపతి హోదాలో తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆదివారం మూడు గంటల పాటు పర్యటించారు. ఉదయం తెవివికి వచ్చిన ఆమె పరిపాలన భవనం వద్ద పోలీసు సిబ్బంది, ఎస్ఎస్ఎస్ వాలంటీర్ల గౌరవ వందనం స్వీకరించారు.
తెవివిలో మూడు గంటల పర్యటన
తెవివికి వచ్చిన గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలుకుతున్న వీసీ రవీందర్
ఈనాడు, నిజామాబాద్, తెవివి క్యాంపస్, న్యూస్టుడే: కులపతి హోదాలో తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆదివారం మూడు గంటల పాటు పర్యటించారు. ఉదయం తెవివికి వచ్చిన ఆమె పరిపాలన భవనం వద్ద పోలీసు సిబ్బంది, ఎస్ఎస్ఎస్ వాలంటీర్ల గౌరవ వందనం స్వీకరించారు. వీసీ ఆచార్య రవీందర్, రిజిస్ట్రార్ శివశంకర్, అదనపు పాలనాధికారి చంద్రశేఖర్ గవర్నర్కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. వీసీ ఛాంబర్లో గవర్నర్ను వర్సిటీ ఉన్నతాధికారులు, పాలక మండలి సభ్యులు మారయ్యగౌడ్, గంగాధర్గౌడ్, ఎల్ఎన్ శాస్త్రి, నసీం, రవీందర్రెడ్డి, ప్రిన్సిపల్ ఆరతి సన్మానించారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న గవర్నర్
అధికారుల దృష్టికి తీసుకెళ్తా..
కంప్యూటర్ సైన్స్ కళాశాలలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులతో గవర్నర్ సంభాషించారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను విద్యార్థి సంఘాల నాయకులు విన్నవించారు. పూర్తిస్థాయిలో బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీ, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియం, బాలికల వసతిగృహ నిర్మాణం, క్రీడల బోర్డు కోసం నిధులు, పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ భద్రత, స్నాతకోత్సవం, పీహెచ్డీ ప్రవేశ పరీక్ష నిర్వహణ తదితర సమస్యలను శివ, సంతోష్, విఘ్నేష్ వివరించారు. అధ్యాపకులు నందిని, నవీన్కుమార్ మాట్లాడారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని తమిళిసై చెప్పారు.
యూనివర్సిటీలో వంటశాలను పరిశీలిస్తూ...
వసతిగృహాల పరిశీలన
బాలికల, బాలుర(పాత, నూతన) వసతిగృహాలను పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థినుల ఇబ్బందులు తెలుసుకున్నారు. భవనం సరిపోవడం లేదని, ఒక్కో గదిలో సామర్థ్యానికి మించి సర్దుకుంటున్నామని వారు విన్నవించారు. మరో బాలికల వసతిగృహ నిర్మాణం అవసరమన్నారు. అనంతరం వర్సిటీలోని గ్రంథాలయాన్ని పరిశీలించిన గవర్నర్.. ఎంత మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారని అడిగారు. కంప్యూటర్లు పని చేస్తున్నాయో లేదో చూశారు. ఈ-లైబ్రరీ సదుపాయం లేకపోవటం, రెండు కంప్యూటర్లు పనిచేయకపోవటం వంటి విషయాలను ఆమె ప్రస్తావించారు. గవర్నర్ కార్యాలయ కార్యదర్శి సురేంద్రమోహన్, సంయుక్త కార్యదర్శులు భవానీశంకర్, రఘుప్రసాద్ పాల్గొన్నారు. కాగా మహనీయుల చిత్రపటాలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేసేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీలోని సమస్యలను విన్నవించేందుకు వస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతూ అభివాదం చేస్తున్న గవర్నర్ తమిళిసై
క్రమశిక్షణ పాటించండి
గవర్నర్ తమిళిసై సంభాషిస్తున్న సమయంలో ఓ విద్యార్థిని కల్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒకింత అసహానానికి గురయ్యారు. క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ‘సమస్యలపై మీరిచ్చిన వినతిపత్రాలు నా దగ్గర ఉన్నాయి. సమస్యలు కాకుండా సాధారణ ప్రశ్నలు అడగాలని, పరిశోధకులు వచ్చి మాట్లాడాలని’ పిలిచారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. వసతిగృహాల్లోని విద్యార్థులు కరోనాతో బాధపడుతుంటే అధికారులు పట్టించుకోలేదని, నిజామాబాద్లోని ప్రైవేటు హోటల్లో సదస్సు నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారని నాయకులు గవర్నర్ దృష్టికి తెచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ సభ్యులు
[ 18-04-2024]
తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. -
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్