సహకారం.. స్వాహాపర్వం
ఎత్తొండ సహకార సంఘానికి సంబంధించి మాజీ డైరెక్టర్ ఒకరు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడంతో రికవరీ ప్రయత్నం ఆగిపోయింది. ధర్పల్లి సొసైటీ పరిధిలో సహకార చట్టం 1964 సెక్షన్ 60 ప్రకారం మాజీ అధ్యక్షుడికి నోటీసులు అందజేసినా నయాపైసా రాబట్టలేదు. రాష్ట్రంలోనే సంచలనం
పాలకవర్గాల తీరు అక్రమాలమయం
ఆడిట్ నివేదికతో వెలుగులోకి..
చర్యలు తీసుకోవడంలో అధికారుల మీనమేషాలు
న్యూస్టుడే, భీమ్గల్
ఎత్తొండ సహకార సంఘానికి సంబంధించి మాజీ డైరెక్టర్ ఒకరు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడంతో రికవరీ ప్రయత్నం ఆగిపోయింది. ధర్పల్లి సొసైటీ పరిధిలో సహకార చట్టం 1964 సెక్షన్ 60 ప్రకారం మాజీ అధ్యక్షుడికి నోటీసులు అందజేసినా నయాపైసా రాబట్టలేదు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన తాళ్లరాంపూర్ సొసైటీలో రూ.3.34 కోట్లు దుర్వినియోగమైంది. రికవరీ ప్రక్రియ ఇది వరకే ప్రారంభమైనా ఇంకా వసూళ్లు కాలేదు. ప్రధానంగా సహకార సొసైటీల్లో ధాన్యం కొనుగోళ్లు, రైతుల వాటాధనం, ప్రభుత్వం అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను ఖర్చు పెట్టడం వంటి విషయాల్లో అవినీతి జరుగుతోంది. సహకార సంఘాల్లో ఏం జరుగుతుందో రైతులకు తెలుసుకొనే అధికారం లేకపోవడంతో అవినీతి పెచ్చురిల్లుతోంది.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్యవేక్షణ లేకపోవడం, పాలకవర్గం చేతిలోనే పెత్తనం ఉండటంతో రైతుల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను సహకార సంఘాలు అప్పనంగా మింగేస్తున్నాయి. దీర్ఘకాలికంగా సీఈవోలు ఒకేచోట పనిచేయడం వల్ల సంఘాల్లో అక్రమాల జోరు కొనసాగుతోంది. అధికారులు, పాలకవర్గం చేతులు కలిపి అన్నదాతల సొమ్ము మాయం చేస్తున్నారని తాజా ఆడిట్ నివేదిక బహిర్గతం చేస్తోంది.
తనిఖీలు నామమాత్రం..
ఫిర్యాదు అందితే గాని స్పందించని అధికారగణంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సంఘాల్లో తరచూ అక్రమాలు జరుగుతున్నా, ఫిర్యాదులు అందినా తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలోని పలు సహకార సంఘాల్లో ధీర్ఘకాలికంగా కో-ఆపరేటివ్ అధికారిగా ఒక్కరే కొనసాగిస్తుండటం వల్ల అవినీతి చోటుచేసుకుంటోంది. సీఈవోల బదిలీలు తక్షణమే చేపడితే సొసైటీల్లో అక్రమాలకు కొద్దిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
మిగతా సొసైటీల్లో..
సొసైటీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆడిటింగ్ చేసిన అధికారులే ధ్రువీకరిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
* బాల్కొండ సొసైటీలో రూ.40 లక్షల వరకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ ఛైర్మన్ తొమ్మిదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు తప్పుగా ఉన్నాయని ఫిర్యాదులు అందినా విచారణ మాత్రం చేయడం లేదు.
* డిచ్పల్లి మండలం రాంపూర్ సొసైటీలో హమాలీల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులొచ్చాయి.
* భీమ్గల్ సొసైటీలో కొనుగోళ్లలో అవినీతి జరిగిందని, న్యాయం చేయాలని రైతులు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. రైతులకు చెల్లించే పంట రుణాలు, వడ్డీ చెల్లింపుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
* నవీపేట్ సొసైటీలో ఎరువుల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేయగా నోటీసులు జారీచేసి చేతులు దులుపుకొన్నారు.
* కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి సొసైటీలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి. 4,609 క్వింటాళ్ల ధాన్యం కొనకుండానే కొనుగోళ్లు చేసినట్లు రికార్డులు చూపారని అందిన ఫిర్యాదుపై స్పందించలేదు. రెంజల్ మండలం నీలా సొసైటీలో ఇలాగే జరిగిందని ఫిర్యాదు అందింది.
అక్రమాలకు అడ్డాగా..
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరాయి. పాలకవర్గాలు సంఘాల్లో వాటాధనం, నిధులను ఇష్టారీతిన ఖర్చు చేస్తూ సొసైటీలను నిర్వీర్యం చేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 98 సంఘాలు ఉండగా నాలుగేళ్లలో మూడు సొసైటీల పరిధిలో రూ.4.57 కోట్ల అవినీతి జరిగిందని ఆడిట్ నివేదిక తేటతెల్లం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ