ఎగరనిద్దాం స్వేచ్ఛగా..
దేశానికి వలస పాలకుల నుంచి విముక్తి లభించింది కానీ... స్త్రీ మాత్రం పురుషాధిక్య సమాజం నుంచి ఇంకా స్వాతంత్య్రం పొందలేదు... ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో తరచూ వినిపించే నిర్వేదపూరితమైన మాటలివి. మహిళను గౌరవించే
స్వతంత్రతే... సోదరికిచ్చే బహుమతి
నేడు రాఖీ పౌర్ణమి
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్
దేశానికి వలస పాలకుల నుంచి విముక్తి లభించింది కానీ... స్త్రీ మాత్రం పురుషాధిక్య సమాజం నుంచి ఇంకా స్వాతంత్య్రం పొందలేదు... ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో తరచూ వినిపించే నిర్వేదపూరితమైన మాటలివి. మహిళను గౌరవించే సంప్రదాయం మనది. అలా ఆచరించే వేడుకల్లో సోదర, సోదరీమణులు నిర్వహించుకొనే రక్షాబంధన్ ఒకటి. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ రక్షాబంధన్ను పురస్కరించుకుని అక్కాచెల్లెళ్ల స్వేచ్ఛా జీవితానికి రక్షాకవచంగా ఉంటామని భరోసా ఇవ్వాల్సిన తరుణమిది.
అక్షరాస్యత..
దేశ అత్యున్నత పదవి అధిరోహించిన ద్రౌపది ముర్ము ఆడపిల్లకు చదువెందుకనే సంకెళ్లను తెంచుకుని బయటకొచ్చారు. ఇలాంటి బంధనాలు ఇందూరులోని చాలా మంది ఆడపడచులకు ఉంది. అమ్మాయిలకు సరస్వతీ ఎందుకనే సమాజంలో బాల్యంలోనే వివాహాలు చేసేయాలని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే సోదరుడిగా మొదట మనమే అండగా ఉండాలి. అక్క, చెల్లి వెంట నిలిచి చదువుకొనేలా ప్రోత్సహించాలి. ఇంట్లో వారికి నచ్చజెప్పి వారి విద్యోన్నతికి దోహదపడాలి. విద్యావిజ్ఞానమే వారికిచ్చే నిజమైన బహుమానం.
వాక్ స్వాతంత్య్రం
ఏం మాట్లాడుతున్నావ్... నువ్వో ఆడదానివన్న సంగతి మరిచావా? ఇదీ సమాజంలో స్త్రీలు మాట్లాడితే ఎదురయ్యే ప్రశ్నలు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ పుణ్యమాని స్థానికసంస్థల్లో 50 శాతం అమలవుతోంది. ప్రజల చేత ఎన్నికైనా.. తమ అధికారాలను వినియోగించుకోలేని పరిస్థితి. అధికారిక హోదాలో ఉన్నా ఏం మాట్లాడాలో నిర్దేశించేది పురుషులే. అందుకే మహిళలు స్వేచ్ఛగా పరిపాలన సాగించడానికి, మాట్లాడటానికి వాక్ స్వాతంత్య్రం కల్పించాలి.
ఆర్థిక
పితృస్వామ్య సమాజం కావడంతో మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కొరవడుతోంది. స్వయంగా వారు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యం. కనీసం బీమా సదుపాయమూ వారికి ఉండదు. వారు సంపాదించినా వేతనంపై వారికి అధికారముండదు. ఏదైనా ఒకరి తోడుతో నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆర్థిక స్వేచ్ఛను కల్పించాల్సిన తరుణమిది.
సమానత్వం
ఉద్యోగాలు, రాజకీయాల్లో సమానత్వమన్నది మహిళల విషయంలో నిషేధించిన అంశం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రమే వివక్ష కనిపించదు. కానీ పనిచేసే స్థలంలో మాత్రం సమానంగా చూడరు. ఇతర రంగాల్లో స్త్రీలకు సరిపోలదని నియామకాలకు తిరస్కరిస్తారు. వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో కూలీలకు వేతనాల్లో వివక్ష కనిపిస్తుంటుంది. ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని అధ్యయనాలు, ఫలితాలతో ప్రాధాన్యం పెరుగుతున్నా... ఇంకా రెట్టింపు కావాల్సిన అవసరముంది.
ఆరోగ్యం ..
అతివలకు ఆరోగ్యస్వేచ్ఛ లేదు. వారి అనారోగ్యంపై ఎక్కడా నోరు విప్పలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితి మారాలి. ఆరోగ్యపరమైన అంశాల్లోనూ సోదరుడిగా వారి అవసరాలను గుర్తించగలగాలి. సకాలంలో గుర్తించి చికిత్స అందించగలిగితే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ వంటివి దరిచేరకుండా చూడొచ్చు. సరైన అవగాహన లేక పోషకాహార లేమి ఇతర గృహహింసకు సంబంధించిన విషయాలు చెప్పుకోలేక శారీరక, మానసిక క్షోభకు గురవుతున్నారు. స్వేచ్ఛగా సమస్యలు చెప్పుకొనే వాతావరణం కల్పించాలి. సోదరులుగా భరోసానివ్వాలి.
అర్ధరాత్రి అభయం
పగలే గడపదాటి బయటకు వెళ్తే ఇంటికొచ్చే వరకు భరోసా లేదని చాలా మంది తల్లిదండ్రులు, అమ్మాయిలు భయాందోళనలో ఉంటున్నారు. మహిళల విషయంలో దృష్టి కోణం మారాల్సిన అవసరముంది. ప్రేమ, తమ వాంఛల కోసం వారిని బలి చేయొద్దు. అదే స్థానంలో మన తోబుట్టువే ఉంటే మనమేం చేస్తామో.. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా నడిరోడ్డుపై తిరగగలిగిననాడే నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు అని గాంధీ అన్న మాటను నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఏ సమయంలో గడప దాటినా ఆడపడచు సురక్షితంగా ఇంటికి చేరుకుంటుందనే భరోసా కల్పించాలి.
ఆలోచనల్లో..
ఆడదానివి నీకేం తెలుసు... ఇదీ దాదాపు అందరి ఇళ్లలో అనే మాట. ఇల్లు, సామాజిక అంశాల్లో తమ ఆలోచనలను పంచుకోవడానికి స్వేచ్ఛ లేదు. కనీసం వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి స్వేచ్ఛ లేదు. పసిప్రాయం నుంచే వారి కలల ప్రపంచానికి ఆడపిల్లవంటూ సంకెళ్లు వేస్తున్నారు. అలా కాకుండా వారికి అండగా ఉంటే.. పర్వతమంత ఎత్తుకు ఎదుగుతారని మలావత్ పూర్ణ, యెండల సౌందర్య, సౌమ్య, నిఖత్ జరీన్ వంటి వారు నిరూపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 19-04-2024]
తాండూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి 6 గ్యారంటీలు, రుణమాఫీ గురించి స్థానిక కాంగ్రెస్ నాయకులు వివరించారు. -
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి