పన్నురాక.. పుస్తకం లేక..
విజ్ఞాన నిలయాలుగా పేర్కొంటున్న గ్రంథాలయాలు నిధుల కొరతతో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేకపోతున్నాయి. ఈ-గ్రంథాలయాలుగా
గ్రంథాలయాల్లో సమస్యలు
పేరుకుపోయిన రూ.4.23 కోట్ల బకాయిలు
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం
విజ్ఞాన నిలయాలుగా పేర్కొంటున్న గ్రంథాలయాలు నిధుల కొరతతో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేకపోతున్నాయి. ఈ-గ్రంథాలయాలుగా సాంకేతికను అందిపుచ్చుకోలేని దుస్థితి కొనసాగుతోంది. ప్రజలు చెల్లించే ఆస్తిపన్ను నుంచి గ్రంథాలయ సెస్సును ఇవ్వడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు రూ.4.23 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడం గమనార్హం.
ఆస్తిపన్నులో 8 శాతం
పంచాయతీలు, నగర, పురపాలికల్లో ఏటా వసూలు చేసే ఆస్తిపన్నులో ప్రత్యేకంగా 8 శాతం గ్రంథాలయ సెస్సుగా తీసుకుంటారు. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జిల్లా పంచాయతీ శాఖ, నగర, పురపాలికలు జమ చేయాల్సి ఉండగా.. పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో పఠనాలయాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఈ సెస్సు నిధులతోనే అభివృద్ధి పనులు, మరమ్మతులు, అవసరమైన మేరకు శాశ్వత భవనాలు, గదుల నిర్మాణం చేపట్టగలరు. దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, పార్ట్టైం ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు. ఇందుకోసం సెస్సు రూపేణా గ్రామపంచాయతీల ద్వారా సుమారు రూ.3.50 కోట్లు రావల్సి ఉండగా.. కేవలం 54 శాతం మాత్రమే జమ చేస్తున్నారు. పురపాలికల ద్వారా సుమారు రూ.2 కోట్లు రావల్సి ఉంటే.. ఇప్పటి వరకు 75 శాతం అందజేశారు.
శాశ్వత భవనాలు అవసరం
ఉభయ జిల్లాల్లో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు లేవు. నిజామాబాద్లో ఇంకా ఐదు శాఖాగ్రంథాలయల(నందిపేట్, రుద్రూరు, భీమ్గల్, జిల్లాకేంద్రం దుబ్బ, న్యూ ఎన్జీవోస్ కాలనీ)కు ఈ సమస్య ఉంది. ఇందులో భీమ్గల్ భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె గదిలోకి మార్చారు. గ్రామీణ గ్రంథాలయాలకు కూడా శాశ్వత భవనాలు అవసరం. దుబ్బ ప్రాంతంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 5 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వివిధ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి అనుకూలంగా ఉన్న దుబ్బ శాఖాగ్రంథాలయానికి అద్దెగది దొరకడం లేదని బోర్గాం(పీ)లోని వివేకానంద గ్రంథాలయం ప్రాంగణంలోకి తరలించారు. ఇటీవలే ఇక్కడి బైపాస్రోడ్డులో నూతన కలెక్టరేట్ నిర్మించారు. అధికారులకు, వివిధ ప్రాంతాలకు చెందిన వారి కోసం ఇదే ప్రాంతంలో విశాలమైన నిర్మాణం చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మూడు శాఖాగ్రంథాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉంది.
వందశాతం వసూలుకు కృషి
- బుగ్గారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి
రెండు జిల్లాల్లో అన్ని శాఖా గ్రంథాలయాలకు శాశ్వత భవనాల కోసం కృషి చేస్తున్నాం. కొత్త మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నాం. పంచాయతీలు, నగర, పురపాలికల నుంచి ఇప్పటి వరకు 60 శాతం వరకు సెస్సు జమ అయింది. ఇంకా పాత, కొత్త బకాయిలు అందించాలని సంబంధిత శాఖాధికారులను కోరాం. నిజామాబాద్ కేంద్ర గ్రంథాలయాన్ని విస్తరించాలని, అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్కు విన్నవించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ సభ్యులు
[ 18-04-2024]
తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. -
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?