పునరుద్ధరణకు నోచుకోక.. వేతనాలు రాక
అతిథి అధ్యాపకుల పునరుద్ధరణపై ఈ విద్యా సంవత్సరం చర్యలు కరవయ్యాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు నెలలు, ఈ ఏడాది రెండు నెలల వేతనం బకాయి ఉంది. ఇటు జీతాలు రాక.. అటు సర్వీసు పునరుద్ధరణకు నోచుకోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అతిథి అధ్యాపకుల ఇక్కట్లు
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం
అతిథి అధ్యాపకుల పునరుద్ధరణపై ఈ విద్యా సంవత్సరం చర్యలు కరవయ్యాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు నెలలు, ఈ ఏడాది రెండు నెలల వేతనం బకాయి ఉంది. ఇటు జీతాలు రాక.. అటు సర్వీసు పునరుద్ధరణకు నోచుకోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఊరించి.. ఉసూరుమనిపించి
2013 నుంచి పని చేస్తున్న అతిథి అధ్యాపకులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఫిట్మెంట్ పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఒక తరగతికి గంటకు రూ.300 చొప్పున నెలకు 72 గంటలు మించకుండా రూ.21,600 వేతనం చెల్లించేవారు. సర్కారు ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తూ వీరికి కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఏడాదికి పైగా నిరీక్షణకు ఫలితం దక్కిందని ఊరట చెందుతుండగా మళ్లీ నిరాశే మిగిలింది. గంటకు రూ.390 చెల్లిస్తామని ప్రకటించినా అమల్లోకి రాలేదు. పెంచిన ఫిట్మెంట్ ప్రకారం ఇప్పటి వరకు నయాపైసా జమ కాలేదు.
ఉమ్మడి జిల్లాలో 120 మందికి నిరాశే
నిజామాబాద్లో 70, కామారెడ్డిలో 50 మంది అతిథి అధ్యాపకులకు పెంచిన ఫిట్మెంట్ లబ్ధి ఒనగూరలేదు. వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏళ్ల నుంచి పని చేస్తున్నా న్యాయం జరగడం లేదని కలత చెందుతున్నారు. అనేక మంది వేతనాలు రాక ఇబ్బందిపడుతున్నారు. కనీసం ఎప్పుడు వస్తాయో తెలియక సందిగ్ధంలో పడ్డారు. కొందరు విధులకు హాజరవుతున్నారు. మరికొందరు వేతనాలు రాక పాఠాలు బోధించడం మానేశారు.
భారం మోయలేకపోతున్నాం
- శ్రీకాంత్, అతిథి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు
సర్వీసును పునరుద్ధరించకున్నా విధులకు హాజరవుతున్నాం. వేతనాలు రాకున్నా పాఠాలు చెబుతున్నాం. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలపై శ్రద్ధ చూపాలి.
సర్కారు దృష్టికి
- షేక్ సలాం, ఇంటర్ నోడల్ జిల్లా అధికారి
అతిథి అధ్యాపకుల పునరుద్ధరణలో జాప్యం కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమే. 30 శాతం ఫిట్మెంట్ వర్తింపజేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. వారి సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్తాం.
జీతాలు పెంచినా నిరాశే
- రమాకాంత్, సంఘం జిల్లా కోశాధికారి
ఈ విద్యా సంవత్సరం 30శాతం ఫిట్మెంట్తో జీతాలు పెంచినా లాభం లేకుండా పోయింది. నెలల తరబడి వేతనాల కోసం నిరీక్షిస్తున్నాం. అధికారులు సర్కారుపై ఒత్తిడి పెంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు