మూడు ముక్కలాట.. బొమ్మాబొరుసు
ఈ నెల 2న రామారెడ్డి మండలం రంగంపేట శివారులో జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6900 స్వాధీనం చేసుకున్నారు.
* ఈ నెల 2న రామారెడ్డి మండలం రంగంపేట శివారులో జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6900 స్వాధీనం చేసుకున్నారు.
* ఇదే రోజు గాంధారి మండల కేంద్రంలోని వైకుంఠధామం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. మూడు ముక్కలాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని రూ.2900 నగదు, ఐదు చరవాణులు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
* ఈ నెల 3న జుక్కల్ మండలం గుండూర్ తండా శివారులో పోలీసులు దాడి చేసి పది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.31,240 లభించాయి.
* ఈ నెల 5న నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులో పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు.
ఇలా జిల్లాలో రోజుకో చోట జూద స్థావరాలపై పోలీసుల దాడులు చేస్తూనే ఉన్నా.. గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతోంది. కొత్తగా బొమ్మాబొరుసు అనే ఆట జోరుగా ఆడుతున్నారు. ప్రధానంగా లింగంపేట అటవీ ప్రాంతంలో స్థానికులు కొందరు రోజుకో చోట నిర్వహిస్తూ రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. మధ్య తరగతి ప్రజలు జూదానికి బానిసై రోడ్డున పడుతున్నారు.
ఈనాడు డిజిటల్, కామారెడ్డి : పోలీసులు దాడులు చేస్తుండటంతో ఆట స్థావరాలు మారుస్తున్నారే తప్ప మానుకోవడం లేదు. ఇటీవల పట్టుబడిన వారిలో పేద వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. గతంలో దీపావళి సందర్భంలో సాగేది. ఇప్పుడు ఏడాదంతా ఆడుతున్నారు. ఇదే అదనుగా కొందరు స్థావరాలు ఏర్పాటు చేసి కమీషన్ దండుకొంటున్నారు.
10 నిమిషాల ముందే సమాచారం
దళారులు జూదరులకు స్థావరం చిరునామా 10 నిమిషాల ముందు మాత్రమే సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలతో పాటు జనసంచారం లేని శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. బొమ్మాబొరుసు ఆడేందుకు సమీప జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్లలో వస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా వాహనాలను బస్టాండు, దుకాణాల ముంగిట నిలుపుతున్నారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనాలపై తరలిస్తున్నారు. ఒకవేళ పోలీసులొస్తే ముందే అప్రమత్తం చేసేందుకు కాపలాదారులను నియమించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో చోటా నేతలే శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మందు, విందులతో పాటు పేకాట కొనసాగిస్తున్నారు. ఉన్నదంతా పోగొట్టుకుంటున్న బాధితులు స్థావరాల సమాచారన్ని పోలీసులకు చెబుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు టాస్క్ఫోర్సు సిబ్బంది లింగంపేట మండలంలో ఆకస్మిక దాడులు చేసినప్పటికీ జూదరులు పారిపోయినట్లు సమాచారం. పోలీసులు గ్రామాల్లో అవగాహన కల్పించడంతోపాటు.. సాంకేతికత ఆధారంగా స్థావరాలను గుర్తించి దాడులు చేయాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో జోరుగా నిర్వహణ స్థావరాలపై పోలీసుల దాడులు
సం।। కేసులు అరెస్టులు బీబీబీ
2019 149 342 3,21,456
2020 283 1042 12,17,654
2021 235 843 10,43,278
2022 74 447 8,67,970
బీబీబీ పట్టుబడిన నగదు (రూ.లల్లో)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ