logo

అంతర్జాతీయ యువజన దినోత్సవం

తెవివి దక్షిణ ప్రాంగణంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం  నిర్వహించారు. ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. యువత సంపూర్ణ ఆరోగ్యంగా

Published : 13 Aug 2022 06:31 IST

భిక్కనూరు, న్యూస్‌టుడే: తెవివి దక్షిణ ప్రాంగణంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం  నిర్వహించారు. ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. యువత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలరని ప్రోగ్రాం అధికారి అంజయ్య అన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలతో అలరించారు. ఏపీఆర్వో యాలాద్రి, అధ్యాపకులు నాగరాజు, నర్సయ్య, దిలీప్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని