logo

దేశభక్తిని చాటాలి

దేశభక్తిని ప్రతి ఒక్కరు చాటాలని ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. ఆదివారం రాత్రి కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థినులతో ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.

Published : 15 Aug 2022 06:01 IST


జెండాలతో విద్యార్థులు, ఎమ్మెల్యే సురేందర్‌

గాంధారి, న్యూస్‌టుడే: దేశభక్తిని ప్రతి ఒక్కరు చాటాలని ఎమ్మెల్యే సురేందర్‌ అన్నారు. ఆదివారం రాత్రి కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థినులతో ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈసందర్భంగా బాణాసంచా కాల్చారు. ఎంపీపీ రాధ, జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌, మాజీ జడ్పీటీసీ సభ్యులు తానాజీ, ఎంపీడీవో సతీష్‌, సొసైటీ, ఏఎంసీ ఛైర్మన్‌లు సాయికుమార్‌, సత్యంరావు, సర్పంచి సంజీవ్‌, కేజీబీవీ ప్రత్యేకాధికారి శిల్ప, తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ వృద్ధులకు, వితంతువులకు నూతన పింఛన్లను ఈ నెల 15న పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సురేందర్‌ అయిలాపూర్‌ గ్రామానికి ఆదివారం వెళ్లి మంజూరు విషయాన్ని ఇంటింటికీ వెళ్లి తీపికబురు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వజ్రోత్సవాల్లో భాగంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామంలో లబ్ధిదారులకు మొదట పింఛను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని