రెండు వాహనాలు ఢీ: ఒకరి దుర్మరణం
ద్విచక్ర వాహనం, ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని రాస్తారోకో
వీరేశం (పాతచిత్రం)
కోటగిరి, న్యూస్టుడే: ద్విచక్ర వాహనం, ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోటగిరి గ్రామానికి చెందిన వీరేశం(42), మహ్మద్ అలీలు ఆదివారం ద్విచక్ర వాహనంపై రుద్రూర్ వైపు వెళ్తుండగా సులేమన్నగర్ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వీరేశం(42) అక్కడికక్కడే మృతి చెందగా మహ్మద్ అలీకి గాయాలయ్యాయి. వీరేశం మరణించాడన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో యజమాని ఘటనా స్థలానికి వచ్చేంత వరకు మృతదేహాన్ని తీయరాదని అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో నిర్వహించారు. కోటగిరి-రుద్రూర్ రోడ్డుపై సుమారు రెండు గంటల పాటు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన కారులను సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ససేమిరా అన్నారు. రుద్రూర్ సీఐ జాన్రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని వాహన యజమానితో చర్చించారు. యజమాని హైదరాబాద్లో ఉన్నానని తాను సోమవారం వచ్చి మాట్లాడతానని సీఐతో చెప్పారు. విషయాన్ని గ్రామస్థులకు చెప్పి యజమాని వచ్చేంత వరకు మృతదేహానికి శవ పరీక్షలు జరపబోమని సీఐ హామీనివ్వడంతో వారు ఆందోళనను విరమించారు. కోటగిరి, రుద్రూర్, వర్ని ఎస్సైలు రాము, రవీందర్, అనీల్రెడ్డిలు బందోబస్తు నిర్వహించారు.
ఆందోళనకారులతో మాట్లాడుతున్న రుద్రూర్ సీఐ జాన్రెడ్డి
చికిత్స పొందుతూ యువకుడు..
బోధన్ గ్రామీణం: జీవితంపై విరక్తి చెంది పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండలం మినార్పల్లికి చెందిన శివకుమార్ అలియాస్ మహ్మద్ రఫీక్ (24) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకొన్నాడు. ప్రస్తుతం వారికి 8 నెలల బాబు ఉన్నాడు. కూలీ పనులు చేసుకొనే యువకుడు వారం క్రితం గడ్డిమందు తాగడంతో బంధువులు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఏఎస్సై రవీందర్ తెలిపారు.
మూర్ఛ వ్యాధితో వృద్ధుడు.. నవీపేట, న్యూస్టుడే: మండల కేంద్రంలోని సుభాష్నగర్కు చెందిన బాబుమియా(60) మూర్ఛవ్యాధితో రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం మృతి చెందారని గ్రామస్థులు తెలిపారు. పాత ఇనుప సామాన్లు సేకరించి విక్రయించే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఎడపల్లి, న్యూస్టుడే: జానకంపేట శివారులో ఆదివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఓ వృద్ధురాలితో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హోర్డింగ్ బోర్డుకు మంటలు
ఇందూరు సిటీ, న్యూస్టుడే: ఆర్పీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణం ఎదుట ఏర్పాటు చేసిన హోర్డింగ్ బోర్డుకు ఆదివారం మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు, దుకాణంలో ఉన్నవారు ఆందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!