logo

పరేడ్‌ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు

పంద్రాగస్టు వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాలనాధికారి నారాయణరెడ్డి, సీపీ నాగరాజు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.

Published : 15 Aug 2022 06:01 IST


ఏర్పాట్ల గురించి చర్చిస్తున్న పాలనాధికారి నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ : పంద్రాగస్టు వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాలనాధికారి నారాయణరెడ్డి, సీపీ నాగరాజు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌, నిజామాబాద్‌ ఆర్డీవో టి.రవి ఉన్నారు. వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 10.30కు జాతీయ జెండా ఆవిష్కరణ, 10.40కు మంత్రి ప్రసంగం, 11.15కు ప్రభుత్వ పథకాలపై శకటాల ప్రదర్శన, 12.25కు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని