logo

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు

మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాదికి సంబంధించి

Updated : 15 Aug 2022 20:36 IST

బీర్కూర్‌: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాదికి సంబంధించి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యకు రూ.1,000, కల్యాణి, అభినయ, స్నేహలకు రూ.500 చొప్పున నగదుతో పాటు సిల్వర్‌ మెడల్స్‌ ఎంపీపీ రఘు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరాజ్యలక్ష్మి, ఎంపీటీసీ సందీప్‌, కో ఆప్షన్‌ సభ్యుడు హరీఫ్‌, ఎస్‌ఎంసీ కమిటీ ఛైర్మన్‌ దుంపల రాజు, ఉపాధ్యాయులు గంగాధర్‌, భరత్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని