logo

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన తెనుగు నారాయణ, చంద్రవ్వ దంపతుల

Published : 15 Aug 2022 12:56 IST

బీర్కూర్‌: మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన తెనుగు నారాయణ, చంద్రవ్వ దంపతుల నివాస గృహం ఇటీవల విద్యుదాఘాతానికి గురై దగ్ధమైంది. దీంతో బాధితులు నిరాశ్రయులయ్యారు. భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాల్యాద్రి రెడ్డి సోమవారం బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. భాజపా తరఫున ఇంటి నిర్మాణానికి సహకరిస్తానని ఆయన తెలిపారు. ఆయన వెంట భాజపా నాయకులు చందు, క్యాకప్ప, సాయిలు, హరీశ్‌‌, నరేశ్‌ రాథోడ్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని