logo

మృత్యువులోనూ వీడని బంధం

అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు వారు. భర్త మరణం తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన లింగంపేట మండలం శెట్‌పల్లిసంగారెడ్డిలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెండా రాజయ్య(61), లచ్చవ్వ(54)

Published : 17 Aug 2022 02:46 IST

భర్త గుండెపోటుతో మృతి.. ఆ వెంటనే భార్య

రాజయ్య : లచ్చవ్వ

లింగంపేట, న్యూస్‌టుడే: అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు వారు. భర్త మరణం తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన లింగంపేట మండలం శెట్‌పల్లిసంగారెడ్డిలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెండా రాజయ్య(61), లచ్చవ్వ(54) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజయ్యకు మంగళవారం ఛాతిలో నొప్పి వస్తుందని కుమారులకు తెలిపారు. వారు చికిత్స నిమిత్తం గోపాల్‌పేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో లొంకల్‌పల్లి గ్రామం సమీపంలో గుండెపోటుకు గురై ద్విచక్రవాహనంపైనే మరణించారు. మృతదేహాన్ని ఇంటకి¨ తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా భార్య లచ్చవ్వ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని