న్యాయవాదుల విధుల బహిష్కరణ
న్యాయవాదుల రక్షణ, సంక్షేమంపై చట్టాలు తేవాలనే డిమాండ్తో మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి తెలిపారు. మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండకు చెందిన న్యాయవాది
నిజామాబాద్లో మాట్లాడుతున్న అధ్యక్షుడు ఎర్రం గణపతి
నిజామాబాద్ న్యాయవిభాగం, ఆర్మూర్ పట్టణం, న్యూస్టుడే: న్యాయవాదుల రక్షణ, సంక్షేమంపై చట్టాలు తేవాలనే డిమాండ్తో మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి తెలిపారు. మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండకు చెందిన న్యాయవాది విజయ్రెడ్డి హత్యను ఖండించారు. న్యాయవాదుల రక్షణ చట్టం గురించి తుల గంగాధర్, గోవర్ధన్, శ్రీధర్, కిరణ్కుమార్గౌడ్, ఖాసీం, భాస్కర్, శంకర్, విఘ్నేశ్వారి సూచనలు అందించారు. కార్యదర్శి నరేందర్రెడ్డి, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజారెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ సమావేశమై విజయ్రెడ్డికి నివాళులర్పించారు. బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంట విప్లవ్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. తులసీదాస్, జగదీశ్, కృష్ణంరాజు, గంగాధర్, షిండే, రాజేశ్వర్, పోచన్న, జీవన్, ప్రవీణ్, కిష్టయ్య, పవన్, అరుణ్, జీజీరాం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
[ 20-04-2024]
మండల కేంద్రంలో కాంగ్రెస్ స్థానిక నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కా్ర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 20-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ శనివారం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
విద్యార్థులు నిరంతర సాధన చేయాలి
[ 20-04-2024]
విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ లక్ష్యం చేరుకోవాలని తెలంగాణ విశ్వావిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి అన్నారు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు