logo

ఆడిటోరియంలో మెగా రక్తదాన శిబిరం

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా కళాభారతి ఆడిటోరియంలో మెగా

Updated : 17 Aug 2022 15:50 IST

కామారెడ్డి పట్టణం : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా కళాభారతి ఆడిటోరియంలో మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ హాజరై మాట్లాడారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి అండగా నిలవాలన్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా ఛైర్మన్‌ రాజన్న మాట్లాడుతూ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరానికి స్పందన రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌, ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని