నెత్తుటి దారులు
జిల్లాలోని రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తు రోడ్డెక్కి.. తిరిగి ఇంటికి చేరే వరకు సురక్షితంగా చేరుకుంటామా లేదా అనేంతలా అధ్వానంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్నవి కూడా.. జులైలో కురిసిన వానలకు మరింత దెబ్బతిన్నాయి. ఫలితంగా ద్విచక్రవాహనాలు అదుపు తప్పుతున్నాయి
జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు
న్యూస్టుడే బృందం పరిశీలన
జిల్లాలోని రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తు రోడ్డెక్కి.. తిరిగి ఇంటికి చేరే వరకు సురక్షితంగా చేరుకుంటామా లేదా అనేంతలా అధ్వానంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్నవి కూడా.. జులైలో కురిసిన వానలకు మరింత దెబ్బతిన్నాయి. ఫలితంగా ద్విచక్రవాహనాలు అదుపు తప్పుతున్నాయి. మరమ్మతుల కోసం నిధులు వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపిస్తేనే దీనికో పరిష్కారం లభించనుంది.
బోధన్ పట్టణం నుంచి సాలూర (7 కి.మీ.)
నాగన్పల్లి, సాలూర శివారు పరిధిలో ఎక్కువగా గుంతలు ఉన్నాయి. మొరం వేయించినా వర్షాలకు కొట్టుకుపోయింది. ర.భ పరిధిలో ఉన్నప్పుడు ఐదేళ్ల క్రితం రోడ్డు వేశారు. ఇటీవల ఎన్హెచ్ 63 పరిధిలోకి మారింది. ‘నర్సి-నాందేడ్ నుంచి సాలూర మీదుగా ఎన్హెచ్-63 రోడ్డు జిల్లా కేంద్రానికి అనుసంధానం కానుంది. సాలూర నుంచి బోధన్ బైపాస్ వరకు రూ.60 కోట్లు మంజూరయ్యాయి. పది మీటర్లకు విస్తరించి కొత్త రోడ్డు వేయిస్తామని’ ఏఈ సతీశ్ వెల్లడించారు.
- న్యూస్టుడే, బోధన్ గ్రామీణం
రాత్రివేళల్లో గుంతలు కనిపించక ఎక్కువ మంది గాయపడుతున్నారు.
నవీపేట - నాళేశ్వర్(4 కి.మీ)
ఈ మార్గంలో మొత్తంగా 108 గుంతలు ఏర్పడ్డాయి. నిజాంపూర్, తుంగిని మధ్య రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ‘రోడ్డు బాగు చేయడానికి రూ.2.58 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు’ పీఆర్ ఏఈ శ్రావణ్కుమార్ తెలిపారు. - న్యూస్టుడే, నవీపేట
పొతంగల్ మంజీర వంతెన నుంచి సిర్పూర్, మహారాష్ట్ర సరిహద్దు వరకు (2 కి.మీ.)
జుక్కల్, మద్నూర్ వాసులు నిజామాబాద్కు వెళ్లేందుకు దూరభారాన్ని తగ్గించడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లడానికి వీలుగా 2009లో పొతంగల్ వద్ద మంజీర నదిపై రెండు వారధులతో పాటు రోడ్డు నిర్మించారు. దీన్ని ఇటీవల జాతీయ రహదారుల పరిధిలోకి మార్చారు. ‘మద్నూర్ నుంచి పొతంగల్, కోటగిరి, రుద్రూర్, బోధన్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదించినట్లు’ సంబంధిత శాఖ అధికారి సతీశ్ తెలిపారు.
- న్యూస్టుడే, కోటగిరి
ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. ఐదుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్ర చైన్పూర్కు చెందిన అనుషాబాయి, రమేశ్, పోతంగల్కు చెందిన గంగాధర్కు తీవ్రగాయాలయ్యాయి.
వినాయకుల బావి వద్ద..
భూగర్భ మురుగుకాల్వల నిమిత్తం ఈ మార్గంలో తవ్వకాలు చేపట్టారు. అనంతరం రూ.20 లక్షలతో తారు వేసినా.. కొన్నాళ్లకే కంకర తేలింది. రాత్రివేళల్లో ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. ‘వినాయకుల బావి నుంచి కి.మీ వరకు రూ.40 లక్షలతో పనులు ప్రారంభిస్తాం. టెండర్ ప్రక్రియ కూడా ముగిసినట్లు’ జోన్-2 ఏఈ ఇనాయత్ తెలిపారు. - న్యూస్టుడే, నిజామాబాద్ నగరం
నందిపేట్ - దేగాం (13 కి.మీ)
నందిపేట్ బైసాస్ రోడ్డు నుంచి దేగాం వరకు గుంతలు ఏర్పడ్డాయి. ఏడేళ్లుగా మరమ్మతులు చేయలేదు. ‘ఆరు కిలోమీటర్ల పరిధిలో పనులు చేయడానికి 2.5 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తామని’ ఆర్అండ్బి ఏఈ రఘువీర్ చెప్పారు. ‘700 మీటర్ల మేర పీఆర్ శాఖకు చెందిన మార్గంలోనూ మరమ్మతులకు రూ.70 లక్షలు మంజూరయ్యాయి. నిధులు సరిపోవట్లేదని తిరిగి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు’ పీఆర్ ఏఈ కిషన్ చెప్పారు. - న్యూస్టుడే, నందిపేట
ఇప్పటివరకు నాలుగు ప్రమాదాలు జరిగాయి.
నందిపేట్కు చెందిన సంతోశ్, రవి, డొంకేశ్వర్కు చెందిన గంగారం గాయపడ్డారు. దుబ్బాక - రేకులపల్లి చౌరస్తా (6 కి.మీ) దుబ్బాక శివారులోని వంతెన నుంచి రేకులపల్లి విద్యుత్తు ఉపకేంద్రం వరకు సమస్యగా మారింది. పదేళ్లుగా ఎలాంటి పనులు చేపట్టలేదు. ‘రామడుగు నుంచి పోత్నూరుగుట్ట వరకు రహదారి విస్తరణ కోసం నిధులు మంజూరై టెండర్ పూర్తయినట్లు’ ఆర్అండ్బి ఏఈ మనోహర్ పేర్కొన్నారు.
- న్యూస్టుడే, ధర్పల్లి
రేకులపల్లికి చెందిన గంగయ్య అనే వృద్ధుడు చనిపోగా.. సల్పబండ తండాకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి.
44వ నంబర్ జాతీయ రహదారి నుంచి పడకల్ మీదుగా చెంగల్ వరకు (15 కి.మీ)
పడకల్ నుంచి కలిగోట్ గ్రామాల మధ్య కంకర తేలింది. భీమ్గల్ వాసులు ఎక్కువగా ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ‘తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినట్లు’ ఆర్అండ్బీ ఏఈ ప్రవీన్ తెలిపారు.
నలుగురు ద్విచక్రవాహనదారులు గాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి