సుదూరం.. దృశ్యరూపక పాఠం
జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యా బోధన అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆరేళ్ల క్రితం ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు చెప్పే విధంగా ఏర్పాట్లు చేశారు. దృశ్యరూపంలో తరగతులను వీక్షించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపేవారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సత్ఫలితాలనివ్వడంతో అన్ని బడుల్లో ఈ తరహా తరగతులను
ప్రభుత్వ బడుల్లో పర్యవేక్షణ కరవు
న్యూస్టుడే, కామారెడ్డి విద్యావిభాగం
జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యా బోధన అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆరేళ్ల క్రితం ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు చెప్పే విధంగా ఏర్పాట్లు చేశారు. దృశ్యరూపంలో తరగతులను వీక్షించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపేవారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సత్ఫలితాలనివ్వడంతో అన్ని బడుల్లో ఈ తరహా తరగతులను తప్పనిసరి చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సంకల్పించారు. ప్రొజెక్టర్తో పాటు ఎల్ఈడీ తెరలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు. ఒక్కో పాఠశాలలో రూ.30 వేల వరకు వెచ్చించి మార్పులు తెచ్చారు. ప్రస్తుతం డిజిటల్ బోధన అటకెక్కింది. జిల్లాలోని 186 ఉన్నత పాఠశాలల్లో 70శాతం వరకు అమలు కావడం లేదు.
సలువుగా అర్థమయ్యేలా..
జిల్లాలో 4- 5 ఏళ్ల వరకు డిజిటల్ తరగతుల నిర్వహణ సజావుగా సాగింది. మొదట 8, 9, 10 తరగతులకు వారంలో 3- 4 క్లాసులు డిజిటల్ పాఠాలే బోధించేవారు. విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడానికి.. ఎక్కువ రోజులు గుర్తుంచుకోవడానికి ఇవెంతగానో దోహదపడ్డాయి. జిల్లాలోని వివిధ బడుల్లో వీటి నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరవైంది. సమయసారిణి నుంచి డిజిటల్ తరగతులను తొలగించారు. ఇవి తప్పనిసరి కాదనే భావన ఉపాధ్యాయుల్లో ఏర్పడింది. క్రమంగా అమలు చేయడం మానేస్తూ వచ్చారు. కొవిడ్ సమయంలో విద్యార్థులు రెండేళ్లపాటు ఆన్లైన్లోనే పాఠాలు విన్నారు. ప్రస్తుతం కొన్ని బడుల్లో గతంలో ఇచ్చిన పరికరాలన్నీ మూలనపడ్డాయి. అంతర్జాల సౌకర్యం లేకపోవడం, గదుల కొరతతో అడ్డంకులు తప్పడం లేదు.
దాతలు టీవీలు, సామగ్రి ఇచ్చినా..
దాతలు స్పందించి వేలాది రూపాయలు విలువ చేసే ప్రొజెక్టర్లు, ఇతర సామగ్రిని బడులకు వితరణ చేశారు. టీవీల్లో గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్లం పాఠ్యాంశాలు వచ్చేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతం చాలాచోట్ల వీటిని వినియోగించడం లేదు.
కొన్ని ప్రాంతాల్లో సిగ్నళ్ల సమస్య
జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అంతర్జాల సిగ్నళ్లు సక్రమంగా అందక విద్యార్థులు డిజిటల్ పాఠాలకు దూరమవుతున్నారు. దాదాపు 30 బడుల్లో పరికరాలు వృథాగా ఉన్నాయి. అంతర్జాల వసతిని మెరుగుపరచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా పరికరాలు
తప్పనిసరి కాదన్నారు
- వేణుశర్మ, విద్యాశాఖ సమన్వయకర్త
డిజిటల్ తరగతులు వివిధ పాఠశాలల్లో అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఇవి తప్పనిసరి కాదని విద్యాశాఖ పేర్కొంది. అందులో ప్రత్యేకంగా బోధించాల్సిన పాఠాలేమీ లేవు. ఇందుకు సంబంధించిన పరికరాలు వృథా కానివ్వం. కొవిడ్ సమయంలో ఆన్లైన్ తరగతులను పకడ్బందీగా చేపట్టాం. ప్రస్తుతం డిజిటల్ తరగతులను మరోమారు చక్కదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురపాలక ఛైర్మన్పై అవిశ్వాసం
[ 24-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భారాస పార్టీ కౌన్సిలర్లు తీర్మానించినట్లు తెలుస్తుంది. -
కాంగ్రెస్లో చేరిన పుర ఛైర్మన్
[ 24-04-2024]
పుర ఛైర్మన్ సత్యనారాయణ సంగారెడ్డిలో బుధవారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. -
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం