ప్రజాప్రతినిధి.. సాగు విధి
నిబద్ధత ఉంటే కానిదేదీ లేదంటున్నారు మహిళామణులు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్పజెప్పిన పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ జీవనాధారమైన పంటల సాగులో రాణిస్తున్నారు నందిపేట్ ప్రజాప్రతినిధులు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ తమ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారు. వ్యవసాయంలో
రెండు రంగాల్లో రాణిస్తున్న మహిళామణులు
న్యూస్టుడే, నందిపేట్
నిబద్ధత ఉంటే కానిదేదీ లేదంటున్నారు మహిళామణులు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్పజెప్పిన పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ జీవనాధారమైన పంటల సాగులో రాణిస్తున్నారు నందిపేట్ ప్రజాప్రతినిధులు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ తమ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారు. వ్యవసాయంలో సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు సాధిస్తూ కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తున్నారు.
మొక్కజొన్న తూర్పారపడుతున్న సర్పంచి లలిత
వన్నెల్(కే) సర్పంచి కాటిపల్లి లలిత గ్రామ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యవసాయంలో రాణిస్తున్నారు. తమకున్న 11 ఎకరాల్లో విభిన్న పంటలు సాగు చేస్తున్నారు. ఐదెకరాల్లో ఆయిల్ఫాం, అంతర పంటగా సోయాబీన్, నాలుగెకరాల్లో పసుపు, అంతరంగా మొక్కజొన్న, రెండెకరాల్లో వరి వేశారు. వీటన్నింటిని పర్యవేక్షిస్తూనే గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టాక రూ.78 లక్షలతో సీసీ రోడ్లు వేయించారు. రూ.23 లక్షలతో సీసీ డ్రైనేజీలు, రూ.29 లక్షలతో సామాజిక భవనాలు నిర్మించారు. రూ.4.5 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతలో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవసరమైతే స్థానిక సమస్యలను ఎమ్మెల్యే జీవన్రెడ్డి దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
కూరగాయల అక్క
వరి పొలంలో జడ్పీటీసీ సభ్యురాలు యమున
జడ్పీటీసీ సభ్యురాలు ఎర్రం యమున. గతంలో వ్యవసాయం చేస్తూ మార్కెట్లో కూరగాయలు విక్రయించేవారు. పదవీ బాధ్యతలు చేపట్టాక కూడా దీనిని కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో అధికారిక కార్యక్రమాలు ఉంటే హాజరవుతున్నారు. వివిధ సమస్యలతో ఇంటికి వచ్చే వారి నుంచి వినతులు స్వీకరించి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రూ.10 లక్షలతో పాతూర్లో సీసీ డ్రైనేజీ నిర్మించారు.రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, నందిపేట్లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేశారు. వివిధ గ్రామాల్లో సామాజిక భవనల్లో బోర్లు వేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. నిత్యం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడం మాత్రం మరవరు. తమకున్న పదెకరాల్లో వరి, కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారు. దిగుబడులు తీసుకెళ్లి సంతలో విక్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!