logo

పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

ఆరోగ్యం సహకరించక మద్యానికి బానిసైన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య

Updated : 26 Sep 2022 16:53 IST

బీర్కూర్‌: ఆరోగ్యం సహకరించక మద్యానికి బానిసైన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బైరాపూర్‌ పంచాయతీ పరిధిలోని నారాయణ్‌పూర్‌ క్యాంపులో చోటు చేసుకుంది. ఏఎస్సై సీతారామమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. అరికెపూడి గోపాలకృష్ణ(71) అనే వృద్ధుడు అనారోగ్యం బారిన పడి మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం తన పశువుల కొట్టంలో పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం చికిత్స పొందుతూ గోపాలకృష్ణ మృతి చెందాడు. ఆదివారం మృతదేహానికి శవపరీక్ష చేసి బంధువులు అప్పగించారు. సోమవారం భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని