అరవై ఏళ్ల వయసులో వరుస హత్యలు
డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని నాగారానికి చెందిన అల్లెపు మల్లయ్య అలియాస్ రాజు అరవై ఏళ్ల వయసులో
ఘరానా హంతకుడి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీపీ నాగారాజు, చిత్రంలో ఏసీపీ, సీఐలు, ఎస్సైలు
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: డబ్బుల కోసం ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని నాగారానికి చెందిన అల్లెపు మల్లయ్య అలియాస్ రాజు అరవై ఏళ్ల వయసులో వరుస హత్యలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇతనిపై వివిధ జిల్లాల్లో 16 కేసులు నమోదై ఉన్నాయి. కమిషనరేట్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ నాగరాజు వివరాలు వెల్లడించారు.
* మల్లయ్య కొంతకాలంగా దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డితోపాటు నిజామాబాద్లో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆగస్టు 24న మాక్లూర్ మండలం డీకంపల్లి వద్ద పత్తి లక్ష్మి(56) మృతదేహం లభించింది. చంద్రశేఖర్ కాలనీకి చెందిన ఆమె ఆటో ఎక్కిన అనంతరం ఇలా జరిగింది. ఆటో ఆధారంగా మాక్లూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా మల్లయ్యతో పాటు అతని అల్లుడు పోశెట్టిని నిందితులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా మల్లయ్య పాత నేరస్థుడిగా తేలింది. 2019లో జక్రాన్పల్లిలో ఓ మహిళ తలపై దాడి చేసి నగలు అపహరించుకెళ్లాడు. 2020లో ముప్కాల్ మండలంలోని పంట పొలంలో ఉన్న మహిళను హత్య చేసి నగలు దోచుకెళ్లాడు. జులైలో కామారెడ్డి జిల్లా లింగంపేటలో కిరాణా దుకాణంలో ఉన్న మహిళపై దాడి చేసి నగలు ఎత్తుకెళ్లాడు. అతని నుంచి 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ నేతృత్వంలోని సీఐలు రాజశేఖర్, నరహరి, ఎస్సైలు యాదగిరిగౌడ్, రాజేశ్వర్ గౌడ్, సిబ్బంది రామకృష్ణ, వేణు, ప్రవీణ్, నీలేష్, అప్సర్ బృందాన్ని సీపీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు