అన్నదాతలకు ధరణి తిప్పలు
భూవివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం ధరణిని అందుబాటులోకి తెచ్చింది. కానీ కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పిదాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి భూములు మరొకరి పేరిట నమోదు కావడం..
భీమ్గల్ తహసీల్దార్కు వినతిపత్రం ఇస్తున్న గంగారెడ్డి
ఈనాడు, నిజామాబాద్: భూవివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం ధరణిని అందుబాటులోకి తెచ్చింది. కానీ కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పిదాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి భూములు మరొకరి పేరిట నమోదు కావడం.. విస్తీర్ణాలు తక్కువగా రావడం, పట్టాభూమి నిషేధిత జాబితాలోకి వెళ్లడం వంటివి జరిగాయి. ధరణిలోని పొరపాట్లు సవరించడానికి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆప్షన్లు ఇచ్చినా.. పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత రైతులు సోమవారం తహసీల్దార్ల కార్యాలయాలకు వచ్చి మరోసారి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
నిషేధిత జాబితాలో నమోదైంది
- సుధాకర్, దుర్గానగర్, మాక్లూర్
మా అమ్మ సావిత్రి పేరిట రెండెకరాల భూమి ఉండేది. కొంతకాలం కిందటే ఆ భూమిని నా భార్య భాగ్యలక్ష్మి పేరిట మార్చాను. కానీ కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. భూమి నిషేధిత జాబితాలో నమోదైనట్లు అధికారులు చెప్పారు. అందులో నుంచి తొలగించాలంటూ ఏడాది క్రితం దరఖాస్తు చేశాను. తాజాగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు.
కొత్త పాసుపుస్తకం రాలేదు
- నెనావత్ రమేష్, ధనంబండ తండా, ధర్పల్లి
మా తాతల కాలం నుంచి భూమిని సాగు చేసుకుంటున్నాం. పాత పట్టా ప్రకారం 2.10 ఎకరాలు ఉంది. కొత్త పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా రాలేదు. 275 సర్వే నంబర్లో జారీ చేసిన పట్టా పాసు పుస్తకాల విస్తీర్ణం ఇంతకు మించి ఉండటంతో సమస్య ఉన్నట్లు అధికారులు చెప్పారు.
గల్ఫ్ వెళ్లొచ్చేసరికి.. మార్చేశారు
- మేతరి గంగారాం, బట్టాపూర్, ఏర్గట్ల
గ్రామంలో నాకు 38 గుంటల భూమి ఉంది. దాన్ని మా గ్రామానికి చెందిన మరో వ్యక్తి గంగారాం పేరుపై ధరణిలో తప్పుగా నమోదు చేశారు. గల్ఫ్లో ఉండటంతో సమస్యను ఆలస్యంగా గుర్తించాను. తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించినా ప్రయోజనం దక్కడం లేదు.
అసైన్డ్ అని చెబుతున్నారు
- కురుమ నరేష్, అంబం, రుద్రూర్
నా పేరు మీద 22 గుంటల పట్టా భూమి ఉంది. కొత్త పాస్ పుస్తకం రావటంతో పాటు రైతుబంధు కూడా వస్తోంది. కుటుంబ అవసరాల నిమిత్తం భూమిని విక్రయించాలని వెళ్లాను. ధరణిలో అసైన్డ్ భూమిగా నమోదై ఉన్నట్లు తహసీల్దార్ చెబుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియట్లేదు.
నా భూమి.. మరొకరి పేరుపై
- మామిడిపల్లి గంగారెడ్డి, చేంగల్, భీమ్గల్
కొత్త పాస్ పుస్తకాలు వచ్చాక నా భూమిని మరొకరి పేరుపై నమోదు చేసినట్లు గుర్తించాను. గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను. క్షేత్రస్థాయిలో పంచనామా చేశారు. నివేదిక కూడా పంపినట్లు అధికారులు చెబుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. మా మండలానికి చెందిన మరో రైతుకు 8 ఎకరాలు ఉండగా.. ధరణిలో 6 ఎకరాలే నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.