అదనపు వసూళ్లు.. కార్యాలయానికి మెరుగులు
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకో చోట అవినీతి వెలుగు చూస్తోంది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయ్యారు. అయినా ఆ శాఖలో మార్పు కనిపించడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాకేంద్రంలోని
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకో చోట అవినీతి వెలుగు చూస్తోంది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయ్యారు. అయినా ఆ శాఖలో మార్పు కనిపించడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో వసూళ్ల దందా వెలుగు చూసింది. కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని ఇటీవల ఖాళీ చేయాలని యజమాని కోరారు. దీంతో పాతరాజంపేటలోని పంచాయతీ భవనంలోకి తరలించాలని నిర్ణయించారు. ఇందుకు తగ్గట్లుగా నవీకరించేందుకు ఒక్కో డాక్యుమెంట్ రైటర్(లేఖరి) నుంచి కొంత మొత్తం రాబడుతున్నట్లు సమాచారం. లేఖరులు ఇదే అదనుగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
డొనేషన్ పేరిట
నూతన భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకయ్యే ఖర్చులను డొనేషన్ పేరిట రాబట్టేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ కార్యాలయం పరిధిలో 34 మంది లేఖరులుండగా రూ.20 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నుంచి నిర్దేశించిన మొత్తం రాబట్టినట్లు తెలిసింది. మిగిలిన వాళ్లు ఇవ్వకుంటే పని జరిగేది లేదని హెచ్చరికలు జారీ చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల నుంచే..
నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయం ముంగిట మకాం వేసిన లేఖరులు డొనేషన్ సొమ్మును ప్రజల నుంచే రాబడుతున్నారు. గతంలో ఒక్కో డాక్యుమెంటుకు వసూలు చేసే మొత్తాన్ని రెట్టింపు చేసి దోచుకుంటున్నారు. రెండ్రోజుల కిందట జిల్లా కేంద్రంలోని అశోక్నగర్కు చెందిన వ్యక్తి ప్లాటు రిజిస్ట్రేషన్కు వెళ్లగా డాక్యుమెంట్ రైటర్ రూ.9500 చెల్లించాలని నిర్దేశించాడు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇది మామూలేనని జవాబివ్వడం గమనార్హం. అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. పురపాలక సంఘానికి చెల్లించాల్సిన వీఎల్టీ ట్యాక్సును కూడా లేఖరులు తమ జేబులో వేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పురపాలక సంఘం అధికారులు కలెక్టర్ ద్వారా సబ్రిజిస్ట్రార్కు లేఖలు పంపారు. వీఎల్టీ దస్త్రం లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని నిర్దేశించారు. అయినా లేఖరుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు, సిబ్బంది దొంగచాటుగా రిజిస్ట్రేషన్లు కానిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
గిట్టకే ఆరోపణలు
- శ్రీలత, సబ్రిజిస్ట్రార్, కామారెడ్డి
నూతన కార్యాలయం నవీకరణ నిమిత్తం వసూళ్లు చేస్తున్నామనడం తప్పుడు ఆరోపణ. ఇటీవల వీఎల్టీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో అదే పాటిస్తున్నాం. ఇది గిట్టని కొందరు లేఖరులు కార్యాలయం సిబ్బందితో పాటు అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎవరికీ పైసా ఇవ్వొద్దు. నేరుగా నా వద్దకు వచ్చి నిబంధనలకు అనుగుణంగా దస్త్రాలు సమర్పిస్తే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!