logo

సర్పంచి భార్య అనుమానాస్పద మృతి

మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి సర్పంచి నవీన్‌కుమార్‌ భార్య ఎర్రోల రవళి(25) అనుమానాస్పదంగా మృతిచెందడం జిల్లాలో కలకలం రేపింది. సర్పంచి, అతని కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధించి

Published : 29 Sep 2022 03:21 IST

భర్తే హత్య చేశారంటూ బంధువుల ఆందోళన

రవళి

మాచారెడ్డి, కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి సర్పంచి నవీన్‌కుమార్‌ భార్య ఎర్రోల రవళి(25) అనుమానాస్పదంగా మృతిచెందడం జిల్లాలో కలకలం రేపింది. సర్పంచి, అతని కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధించి హత్య చేశారని ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సంతోష్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భైౖంసాకు చెందిన రవళితో నవీన్‌కుమార్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అనంతరం ఆమెను కారులో ఎక్కించుకొని బంధువుల ఇంట్లో దింపేందుకు బయలుదేరాడు. తనతోపాటు పురుగుల మందు తెచ్చుకున్న రవళి క్షణికావేశంలో తాగేశారు. హుటాహుటిన కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయినట్లు తెలిపారు.

అదనపు కట్నం కోసమే..! రవళిని అత్తింటి వారే హత్య చేశారంటూ జిల్లా ఆసుపత్రిలోని శవాగారం వద్ద ఆమె బంధువులు బాధితులు ఆందోళనకు దిగారు. అదనపు కట్నం కోసం వేధించారని ఆరోపించారు. పోలీసులు చేరుకొని న్యాయం చేస్తామని నచ్చజెప్పారు.అక్క స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని