ఏడుగురు వార్డుసభ్యుల రాజీనామా
రెంజల్ పంచాయతీ పరిధిలోని గాంధీ విగ్రహం సమీపంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాలకవర్గం తీర్మానం చేసినా కార్యదర్శి సంతకం చేయకపోవడం.. కేసులు నమోదు చేస్తామంటూ పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు బెదిరింపులకు
రెంజల్ ఎంపీడీవో శంకర్కు రాజీనామా పత్రాలు అందిస్తున్న రెంజల్ పంచాయతీ వార్డుసభ్యులు
రెంజల్, న్యూస్టుడే: రెంజల్ పంచాయతీ పరిధిలోని గాంధీ విగ్రహం సమీపంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాలకవర్గం తీర్మానం చేసినా కార్యదర్శి సంతకం చేయకపోవడం.. కేసులు నమోదు చేస్తామంటూ పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు బెదిరింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ ఏడుగురు వార్డుసభ్యులు బుధవారం ఎంపీడీవో శంకర్కు రాజీనామా పత్రాలు అందజేశారు. రెండు నెలల క్రితం ఓసారి, తాజాగా మరోసారి తీర్మానపత్రంపై సంతకం చేయకుండా కార్యదర్శి తమను బేఖాతరు చేస్తున్నారన్నారు. సర్పంచి రమేశ్కుమార్ వారికి మద్దతు ప్రకటించారు. వారం రోజుల వ్యవధిలో సమస్యకు పరిష్కారం లభించనిపక్షంలో తానూ అదేబాట పడతానని సర్పంచి స్పష్టం చేశారు. రాజీనామా చేసిన వార్డుసభ్యుల్లో గంగారెడ్డి, రంజిత్, సగ్గు వెంకట్, లక్ష్మణ్, కనకవ్వ, రేఖ, రాణి ఉన్నారు. ఈ విషయమై కార్యదర్శి మధుసూదన్రెడ్డిని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. పంచాయతీ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు తీర్మానం చేయడం చట్టవిరుద్ధమన్నారు. తీర్మానం చేసే అధికారం పాలకవర్గానికి లేదన్నారు. అయితే శివాజీ విగ్రహం ఏర్పాటు చేయమని ఉత్సవ కమిటీ సభ్యులు తహసీల్దార్ రాంచందర్, ఎస్సై సాయన్న, కార్యదర్శి మధుసూదన్రెడ్డికి హామీ పత్రం అందజేశారు. ఇటీవల వీరిని పోలీసు, పంచాయతీరాజ్ అధికారులు కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో విగ్రహం వద్దు.. కేసులు వద్దని తమ నిర్ణయం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా