logo

బోయిడ నర్సయ్యకు ట్యూటర్‌ ప్రైడ్‌ పురస్కారం

బస్సాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బోయడ నర్సయ్య ట్యూటర్స్‌ ప్రైడ్‌ పురస్కారానికి ఎంపికయ్యారని ఎంఈవో రాజేశ్వర్‌ తెలిపారు. ఐడియల్‌ టీచర్‌ అవార్డ్స్‌ ప్రోగ్రాంకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. దేశ

Published : 29 Sep 2022 03:21 IST

బాల్కొండ, న్యూస్‌టుడే: బస్సాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బోయడ నర్సయ్య ట్యూటర్స్‌ ప్రైడ్‌ పురస్కారానికి ఎంపికయ్యారని ఎంఈవో రాజేశ్వర్‌ తెలిపారు. ఐడియల్‌ టీచర్‌ అవార్డ్స్‌ ప్రోగ్రాంకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. దేశ వ్యాప్తంగా 15,500 దరఖాస్తులు రాగా అందులో నుంచి బోమడ నర్సయ్య ఎంపికయ్యారని చెప్పారు. కొవిడ్‌ సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్లో బోధించడం, గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం తదితర అంశాలను పరిశీలించి ఎంపిక చేశారు. అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ కిట్స్‌ కళాశాలలో పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఆయణ్ని ప్రధానోపాధ్యాయుడు రాజారాం, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని