బెంబేలెత్తిస్తున్న శునకాలు
నగరం.. పట్టణాలు.. పల్లెలు అనే తేడా లేకుండా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రుల్లో పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవడం కష్టమవుతోంది. వీటి బెడద తీవ్రమవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కుక్కల నియంత్రణలో ఎలాంటి నిర్ణయం
నగరంలో ఆగిన శస్త్రచికిత్స ప్రక్రియ
న్యూస్టుడే, నిజామాబాద్ నగరం
* ఆర్మూర్ పట్టణం పెద్దబజార్లో పది రోజుల క్రితం కుక్క దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.
* తాజాగా డిచ్పల్లి మండలం ధర్మారం(బీ)లోనూ ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి.
నగరం.. పట్టణాలు.. పల్లెలు అనే తేడా లేకుండా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రుల్లో పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవడం కష్టమవుతోంది. వీటి బెడద తీవ్రమవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కుక్కల నియంత్రణలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తలనొప్పి వ్యవహారమంటూ అటు పంచాయతీ, బల్దియా పాలకవర్గాలతోపాటు అధికారులు చేతులెత్తేస్తున్నారు.
హైకోర్టు ఆదేశించినా..
శునకాల నియంత్రణపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తులు ప్రతి మున్సిపాలిటీలో కుక్కల జనన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు ఆరు నెలల గడువిచ్చినా ఎక్కడా ముందడుగు పడలేదు.
గతంలో ఇలా..
ఎక్కడైనా కుక్క కాటు ఘటనలు చోటు చేసుకుంటేనే పంచాయతీ, బల్దియా సిబ్బంది స్పందిస్తున్నారు. ఆ ప్రాంతంలో వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. జంతు ప్రేమికుల నుంచి అభ్యంతరాలు రాకుండా ఆచితూచి అడుగేస్తున్నారు. గతం లో నగరపాలక సంస్థ అధికారులు శునకాలను పట్టుకెళ్లి డిచ్పల్లి-ఇందల్వాయి, ఆర్మూర్, మామిడిపల్లి పరిధిలోని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టి వచ్చేవారు. ఈ ప్రక్రియ అనధికారికంగా చేపట్టారు.
ముగిసిన ఒప్పందం
నిజామాబాద్ నగరంలో కుక్కలకు కు.ని. శస్త్రచికిత్సలు చేపట్టేందుకు హైదరాబాద్లోని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. నిబంధనల మేరకు వాటికి ఆపరేషన్ చేసిన తర్వాత వారం రోజులపాటు సంరక్షణలో ఉంచుకునేవారు. శునకాల ఆరోగ్యం మెరుగుపడగానే ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అదే ప్రాంతంలో వదిలేసేవారు. ఒప్పందం ముగియడంతో ప్రక్రియ అటకెక్కింది. త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇవీ నిబంధనలు
* శునకాలకు విషం ఇచ్చి చంపడం నిషేధం
* సుశిక్షితులైన వ్యక్తులు మాత్రమే వాటికి గాయం కాకుండా పట్టుకోవాలి
* కుక్కల తరలింపునకు చెత్త తరలించే వాహనాలు ఉపయోగించొద్దు
* కు.ని. చికిత్సకు ముందు, తరువాత విశ్రాంతి గదుల్లో ఉంచాలి.
* అటవీ ప్రాంతంలో వదిలేస్తే అక్కడ నీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
నగర శివారులోని ముబారక్నగర్ మహాలక్ష్మి నగర్లో కుక్కల గుంపు
ఫిర్యాదు చేస్తే పట్టుకుంటారు
- జయసుధ, జిల్లా పంచాయతీ అధికారి, నిజామాబాద్
గ్రామాల్లో ఎక్కడైనా కుక్కల సమస్య తీవ్రంగా ఉందని పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నారు. ప్రత్యేక కార్మికుల ద్వారా వాటిని పట్టుకొని దూరంగా వదిలేస్తున్నారు. శునకాల నివారణకు పంచాయతీలో ప్రత్యేకంగా సిబ్బంది లేరు. ఉన్న కార్మికులు పారిశుద్ధ్య సమస్యపై దృష్టి సారిస్తున్నారు. కుక్కలతో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం.
నివారణపై దృష్టి
- సాజీద్అలీ, ప్రజారోగ్య అధికారి, నగరపాలక సంస్థ
నగరంలో కుక్కల నివారణపై చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా కాలనీ నుంచి ఫిర్యాదు వస్తే సిబ్బంది వెళ్లి పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే ప్రక్రియ మళ్లీ ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కిసాన్ కాంగ్రెస్ సభ్యులు
[ 18-04-2024]
తాండూరు ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సంఘ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. -
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ