logo

నిజామాబాద్‌ జిల్లా జడ్జికి సన్మానం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ జిల్లా పర్యటనను విజయవంతం చేసినందుకు... నిజామాబాద్‌ న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో

Published : 30 Sep 2022 03:21 IST

నిజామాబాద్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ జిల్లా పర్యటనను విజయవంతం చేసినందుకు... నిజామాబాద్‌ న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాజడ్జి కుంచాల సునీతను గురువారం సన్మానించారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని జిల్లాజడ్జి పేర్కొన్నారు. మొదటి అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్‌రావు, కుటుంబ కోర్టు జడ్జి షౌకత్‌ జహన్‌ సిద్దిఖీ, ఎస్సీ-ఎస్టీ కోర్టు జడ్జి పంచాక్షరి, సీనియర్‌ సివిల్‌జడ్జి శ్రీకాంత్‌బాబు, న్యాయసేవా సంస్థ కార్యదర్శి పద్మావతి, జూనియర్‌ సివిల్‌జడ్జి భవ్య, మొదటి అదనపు కోర్టు మెజిస్ట్రేట్‌ సౌందర్య, ఎక్సైజ్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ గిరిజ, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని