నెలాఖరుకు మూడు ఆర్వోబీలు పూర్తి
హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆర్నెల్లల్లో నాందేడ్ వరకు పూర్తవుతాయని అధికారులు చెప్పారని ఎంపీ అర్వింద్ అన్నారు.
పాదచారుల వంతెన ప్రారంభిస్తున్న ఎంపీ అర్వింద్, చిత్రంలో డీఆర్ఎం శరత్ చంద్రయాన్
ఇందల్వాయి, న్యూస్టుడే: హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆర్నెల్లల్లో నాందేడ్ వరకు పూర్తవుతాయని అధికారులు చెప్పారని ఎంపీ అర్వింద్ అన్నారు. ఇందల్వాయి రైల్వేస్టేషన్లో రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తైన ప్లాట్ఫాం, పాదచారుల వంతెనను శనివారం రైల్వేశాఖ డీఆర్ఎం శరత్చంద్రాయన్తో కలిసి ప్రారంభించారు. ఈ స్టేషన్ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.4 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఆర్మూర్లో ఈ నెలాఖరుకు మూడు ఆర్వోబీలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో తొమ్మిది చోట్ల రైల్వేగేట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా చెల్లిస్తే కేంద్రం వంతెనలు నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు స్థానిక నేతలు ఇందల్వాయిలో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలని, ఇందల్వాయి-ధర్పల్లి మార్గంలో ఆర్వోబీ నిర్మించాలని వినతిపత్రాలు అందజేశారు. వెంట భాజపా రూరల్ ఇన్ఛార్జి దినేశ్ కులాచారి, మండలాధ్యక్షులు నాయిడి రాజన్న, గంగారెడ్డి, రైల్వే అధికారులు మోతీలాల్ నాయక్, రామకృష్ణ, అభిరాం, వెంకన్న ఉన్నారు.
అభివృద్ధి చేసి చూపిస్తా..
మాక్లూర్ గ్రామీణం, న్యూస్టుడే: అభివృద్ధి చేసి చూపిస్తానని.. చేయకముందే ఎంతో చేశామని చెప్పుకోవటం తమకు తెలియదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. మాక్లూర్ మండలం రాంచంద్రపల్లిని శనివారం ఆయన సందర్శించారు. గ్రామంలో ప్రధాన వీధులు పరిశీలించారు. ముఖ్యమై సమస్యలైన బైపాస్ రోడ్డు, రైతు గిడ్డంగి, నిజాంసాగర్ కాలువపై రెండు వంతెనలు, కల్యాణ మండప నిర్మాణాల గురించి గ్రామస్థులు విన్నవించారు. స్పందించిన ఎంపీ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. త్వరలో అంచనాలు రూపొందించి ఎంపీ ల్యాడ్స్తో దశల వారీగా ఒక్కోటి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నూతుల శ్రీనివాస్రెడ్డి, కంచెట్టి గంగాధర్, మారంపల్లి గంగాధర్, సంతోష్, వినోద్, వినోద్, సురేశ్ నాయక్, మహేష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ