మన మధ్యే బాపూ
ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూ ప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాలవారు నమ్మలేకపోవచ్చు.... ఇదీ ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నమాటలు. బ్రిటీష్ వలస పాలన నుంచి విముక్తి కల్పించడంతో పాటు అప్పటికే సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారదోలడానికి గాంధీజీ ప్రయత్నించారు.
మహాత్ముడి ఆశయాల దిశగా ఇందూరు పల్లెలు
ఇందూరు ఫీచర్స్, న్యూస్టుడే
ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూ ప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాలవారు నమ్మలేకపోవచ్చు.... ఇదీ ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నమాటలు. బ్రిటీష్ వలస పాలన నుంచి విముక్తి కల్పించడంతో పాటు అప్పటికే సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారదోలడానికి గాంధీజీ ప్రయత్నించారు. అలాంటి వాటిలో కొన్ని కీలకమైన అంశాలను భుజానికెత్తుకుని ఆచరణలో పెడుతున్నాయి పలు ఊళ్లు. నేటి పరిస్థితులు, వనరుల ఆధారంగా ఆదర్శనీయమైన విధానాలతో ఆకట్టుకుంటున్నాయి. బాపూజీ ఆశయాలను బతికిస్తున్నాయి. అలాంటి వాటిపై గాంధీ జయంతి సందర్భంగా ‘ఈనాడు’ ప్రత్యేక కథనం...
అందరూ బడిలోనే...
చదువు ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పిన వ్యక్తి గాంధీ. అక్షరాస్యత పెరగాలన్న ఆయన స్ఫూర్తిని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి తీసుకుంది. తమ దగ్గర డ్రాపౌట్లు లేకుండా పిల్లలందరినీ బడికి పంపుతున్నారు. ఏడేళ్లుగా డ్రాపౌట్ లేని పల్లెగా నిలిచింది. బడిఈడు పిల్లలంతా పాఠశాలల్లోనే కనిపిస్తారు.
* ప్రాథమిక పాఠశాలలు : 4 * విద్యార్థులు : 234 * ఉన్నత పాఠశాలలు : 186
శతశాతం పన్నుల వసూలు
ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామంలో గత ఐదేళ్లుగా శతశాతం ఇంటి పన్నులు వసూలు చేయడం ద్వారా గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వస్తున్న 14వ ఆర్థిక సంఘం, ఎన్ఎఫ్సీ నిధులు, ఇంటి పన్నులు గ్రామ ప్రగతిలో కీలకంగా మారాయి. సర్పంచి బంటు దయానంద్ చక్కటి ప్రణాళికతో కాలనీల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు నిర్మించారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదాద్దారు. ఈ గ్రామం జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్కు ఎంపికైంది. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజనకు ఎంపిక కావడంతో రూ.30 లక్షల నిధులు వచ్చాయి. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మించుకున్నారు.
* జనాభా : 548 * ఓటర్లు : 428 * నివాసాలు : 172 * భౌగోళిక విస్తీర్ణం : 705 ఎకరాలు
- ఆర్మూర్ గ్రామీణం
స్వచ్ఛత బాటలో పయనిస్తూ...
పారిశుద్ధ్యంలో స్వచ్ఛత సాధించాలని జాతిపిత భావించారు. ఈ స్వచ్ఛత విషయంలో బహిరంగ మలవిసర్జన అపరిశుభ్ర వాతావరణానికి కారణమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ పిలుపును అందుకుని వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవడమే కాదు వినియోగిస్తూ నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి, కామారెడ్డిలో శివాయిపల్లి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ పల్లెల్లో అందరూ మరుగుదొడ్లు వినియోగిస్తున్నారు.
సిర్నాపల్లి జనాభా : 3806 * కుటుంబాలు : 1146 * మరుగుదొడ్లు : 1146
శివాయిపల్లి జనాభా : 1100 * కుటుంబాలు : 215 * మరుగుదొడ్లు : 215
మురుగే కనిపించని ఊరు
తమ గ్రామంలో డ్రైనేజీలు ఎప్పుడు కడతారు? తరచూ పర్యటించే పాలకులకు ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్న. వారు అప్పటికప్పుడు సమాధానమిచ్చి దాటుకున్నా... నిధులొచ్చే వరకు ప్రజలు మురుగుతో సహజీవనం చేయాల్సిందే. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకపల్లి గ్రామస్థులు మాత్రం అలా చూడలేదు. మురుగు కాలువలే అవసరం లేకుండా మురుగు సమస్యను అధిగమించవచ్చని నిరూపించారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకుని వినియోగించిన నీటిని భూమిలోకి ఇంకిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పరిరక్షించడంతో పాటు మురుగు సమస్యకు స్వస్తి పలకడం వంటి ప్రయోజనాలు చేకూరాయి.
వెంకంపల్లి జనాభా : 732 * నివాసాలు : 172
శాంతి చర్చలకు బాటలు...
నేరం ఒక జబ్బు అన్నారు గాంధీజీ. నేరాలతో గ్రామంలో శాంతికి విఘాతం కలుగుతుంది. అప్పుడు ఊరు ప్రగతికి అవరోధం ఏర్పడుతోందన్నది వాస్తవం. ఇంత పెద్ద దేశానికి శతాబ్దాల వలస పాలన నుంచి విముక్తి కల్పించడానికి మహాత్ముడు అనుసరించింది అహింస, శాంతి చర్యల విధానమే. అలాంటి విధానాన్ని నేడు కొన్ని పల్లెలు అనుసరిస్తున్నాయి.
నందిగామ...: నవీపేట మండలం నందిగామలో 2014 ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలకు చెందిన 32 మందిపై కేసులు నమోదవగా ఆరు నెలలు కోర్టు చుట్టూ తిరిగారు. కేసులతో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా వివాదాలను గ్రామంలోనే పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. 2016లో వివాదరహిత పల్లెగా గుర్తింపు పొందింది. నేటికీ అక్కడ ఆత్మహత్యలు మినహా ఇతర కేసులేవీ నమోదు కాకుండా ప్రతి వివాదాన్ని గ్రామంలోనే శాంతియుతంగా పరిష్కరిస్తారు.
* జనాభా : 3100 * ఓటర్లు : 1150 * కుటుంబాలు : 420
తిమ్మక్పల్లి : ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందీ పల్లె. గ్రామంలో ఎవరికి ఏ వివాదం తలెత్తినా సాధ్యమైనంత వరకు పోలీసు ఠాణా గడప తొక్కకుండా వివాదాలను సామరస్య పూర్వకంగా పల్లెలోనే పరిష్కరించుకుంటున్నారు. దాదాపుగా ఠాణా గడప తొక్కకుండానే జాగ్రత్తపడుతున్నారు.
* జనాభా : 292
చెత్త సేకరణలో మిన్న
పుష్కరాల సమయంలో ఇష్టారీతిన పడేసిన చెత్తను స్వయంగా గాంధీజీనే శుభ్రం చేశారు. మన దైనందిన జీవితంలో వెలువడే వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేయడంపై శ్రద్ధ చూపడంలేదు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ పల్లెలో ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇంటికి రెండు చెత్త డబ్బాలు ఇచ్చారు. వాటిలో నిల్వ చేసిన చెత్తను ఇంటి ముందుకు వచ్చిన వాహనం స్పీకర్ ప్రకటనతో నివాసదారులు వాహనంలో వేస్తున్నారు. చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సర్పంచి పద్మ చొరవ, ప్రణాళికతో చెత్త సేకరణ ప్రక్రియ నిర్దేశించిన లక్ష్యానికి అనుకూలంగా సాగుతోంది.
జనాభా : 4064 * నివాసాలు : 1100
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవతావాది వి.పి.చందన్ రావు
[ 29-03-2024]
వి.పి చందన్రావు కవిత్వంలో మానవతావాది అని సీనియర్ జర్నలిస్ట్, సంపాదకులు బైస దేవదాసు అన్నారు. -
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
[ 29-03-2024]
తాండూర్ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో శుక్రవారం రెండు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. -
కాంగ్రెస్ పార్టీ మండల నూతన కమిటీ ఏర్పాటు
[ 29-03-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు శుక్రవారం నాయకుల సమక్షంలో నాగిరెడ్డిపేట మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. -
ప్రధాని మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి: భాజపా
[ 29-03-2024]
ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధి దిశలో పయనిస్తోందని జహీరాబాద్ ఎంపీ, భాజపా జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. -
వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభం
[ 29-03-2024]
జిల్లా పాలనధికారి జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారం శుక్రవారం మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో విశ్వనాథం తెలిపారు. -
ఓటేయాలి.. చైతన్యం చాటాలి
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఆధారాలు చూపిస్తే నగదు వాపస్
[ 29-03-2024]
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పోలీసు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులకు -
లక్ష్య సాధనలో పరుగులు
[ 29-03-2024]
జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ ఫీజు వసూళ్లు ఈ ఏడాది ఊపుమీదున్నాయి. -
ఇంటి వద్దే ఓటు
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. -
బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు
[ 29-03-2024]
బాసర రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
[ 29-03-2024]
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
స్తబ్దుగా సలహా సంఘాలు
[ 29-03-2024]
ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. -
చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్
[ 29-03-2024]
మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. -
కుళాయి కనెక్షన్లు.. ఆన్లైన్లో తప్పులు
[ 29-03-2024]
పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. -
కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు