logo

కారు, ద్విచక్రవాహనం ఢీ.. ఇద్దరి మృతి

కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  

Published : 03 Oct 2022 10:08 IST

బాల్కొండ : కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కిసాన్‌నగర్‌కు చెందిన రాజు(36), నర్సయ్య(40)ద్విచక్రవాహనంపై కిసాన్‌నగర్‌ నుంచి చాకిర్యాల్‌లో భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనుకగా వస్తున్న కారు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు, నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో మెండోరా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రాజు స్వస్థలం గుంటూరు జిల్లా కాగా.. కొంతకాలంగా కిసాన్‌ నగర్‌లో ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని