దశమ విజయాలు
విజయదశమి అనగానే.. ప్రతిఒక్కరు తమ ఇబ్బందులు తొలగి సౌకర్యాలు చేకూరాలని అమ్మవారిని కొలుస్తారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఉభయ జిల్లాల్లో ఏడాది కాలంగా జరిగిన ప్రగతిని పరిశీలిస్తే పది అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి.
వసతుల కల్పనలో ఉమ్మడి జిల్లా పురోగతి
నేడు దసరా ఉత్సవాలు
ఈనాడు, నిజామాబాద్
విజయదశమి అనగానే.. ప్రతిఒక్కరు తమ ఇబ్బందులు తొలగి సౌకర్యాలు చేకూరాలని అమ్మవారిని కొలుస్తారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఉభయ జిల్లాల్లో ఏడాది కాలంగా జరిగిన ప్రగతిని పరిశీలిస్తే పది అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే దసరా రోజున ఆయా విశేషాలపై ప్రత్యేక కథనం.
పల్లెప్రగతిలో దూకుడు
1. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాల నిర్వహణలో నిజామాబాద్ జిల్లా దేశంలోనే గుర్తింపు పొందింది. స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2022లో జాతీయ స్థాయిలో మూడు, దక్షిణాదిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలోనూ నాలుగు పంచాయతీలు చోటు సాధించాయి. కామారెడ్డి జిల్లా 14వ స్థానంలో నిలిచింది.
సాగునీటి కష్టాలు అధిగమిస్తూ..
2. వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద మూడు చెరువులను కలిపి రిజర్వాయర్ నిర్మించనున్నారు. 30 వేల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని రూ.106 కోట్ల నిధులతో చేపడుతున్నారు. ఈ పనులు ప్రారంభమయ్యాయి. చందూర్, జాకోరా వద్ద రూ.100 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా 15 వేల ఎకరాలకు నీరందనుంది.
పాలనా భవనాలు కొత్తగా
3. కామారెడ్డి, నిజామాబాద్కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ప్రభుత్వ శాఖలు వేర్వేరు చోట్ల అద్దె భవనాల్లో ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఒకేచోటకు రావడంతో అన్ని సేవలు అక్కడే లభిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ఉభయ జిల్లాల్లో కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు చేశారు.
హరితహారం.. పచ్చని తోరణం
4. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో రెండు జిల్లాల యంత్రా ంగం చురుగ్గా పాల్గొంటున్నాయి. సర్కారు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి.
రికార్డు స్థాయిలో వరి సాగు..
5. ఐదేళ్ల క్రితం ఉభయ జిల్లాల్లో 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేది. ప్రస్తుతం ఒక్క ఇందూరులోనే 4 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. కామారెడ్డిలో మరో 3 లక్షల ఎకరాల్లో ఇదే పంట వేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 600 వరకు ఏర్పాటు చేయాల్సి వస్తోంది.
భూమి చిక్కులు తొలగించి..
6. ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా 22-ఏలో చేర్చే క్రమంలో కొన్ని పట్టాభూములు అందులో నమోదయ్యాయి. క్షేత్రస్థాయి సర్వే నివేదికల ఆధారంగా పాలనాధికారులు మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లి సమీక్షించి వీలైనన్ని పరిష్కరించారు. కామారెడ్డిలో 24,088 ఖాతాలకు సమస్య ఉండగా 14,683.. నిజామాబాద్లో 30 వేలకు గాను 8312 మంది సమస్య పరిష్కరించారు.
రక్తహీనతను జయిస్తూ..
7. కామారెడ్డిలోని చిన్నారుల్లో రక్తహీనత అధికంగా ఉంది. ఈ సమస్య ఎదుర్కొంటున్న 12,897 మంది బాలలను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.5 వేల విలువైన ఆయుర్వేద మందులు సమకూర్చారు. కలెక్టర్ల ఖాతాల్లో ఉండే నిధులను ఇందుకోసం వెచ్చించారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య రెండు వేలకు తగ్గింది.
మెరుగైన వైద్యం
8. ప్రభుత్వ దవాఖానాల్లో సేవలు మెరుగయ్యాయి. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో మోకీలు శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చింది. కామారెడ్డికి వైద్య కళాశాల మంజూరు కాగా బాన్సువాడలో నర్సింగ్ కళాశాల, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది.
వాణిజ్యానికి ఊతం..
9. సంగారెడ్డి-నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారి ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల మీదుగా వెళ్తోంది. రాష్ట్ర రాజధానితో పాటు మహారాష్ట్రతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.
కొత్త బల్దియాలకు బృహత్ ప్రణాళికలు
10. మున్సిపాలిటీల్లో బృహత్ ప్రణాళికల అమలుకు ముందడుగు పడింది. కొత్తగా ఏర్పడిన బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్గల్ పట్టణాల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పాత వాటిల్లో పెరిగిన జనాభాకు తగ్గట్లు సౌకర్యాలు మెరుగుపర్చనున్నారు. ఆయా చోట్ల ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్