logo

అథ్లెటిక్స్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికలు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆకాంక్షించారు.

Published : 05 Oct 2022 03:37 IST


పతకాలు సాధించిన క్రీడాకారులతో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

కామారెడ్డి క్రీడావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన అర్హత పోటీల్లో ఎంపికైన వారికి పతకాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పున్న రాజేశ్వర్‌, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, వెంకటేశ్వర్‌గౌడ్‌, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని