logo

వేతన బకాయిల చెల్లింపులు హర్షణీయం

జిల్లాకేంద్రంలో బల్దియా కార్మికులకు రావాల్సిన ఎరియర్స్‌ను పండగ వేళ చెల్లించడంతో సీఐటీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిని మంగళవారం సన్మానించారు.

Published : 05 Oct 2022 03:48 IST


కామారెడ్డిలో ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌ను సన్మానిస్తున్న కార్మిక సంఘాల ప్రతినిధులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాకేంద్రంలో బల్దియా కార్మికులకు రావాల్సిన ఎరియర్స్‌ను పండగ వేళ చెల్లించడంతో సీఐటీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిని మంగళవారం సన్మానించారు. జూన్‌ 2021 నుంచి రావాల్సిన బకాయిలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వంద మంది కార్మికులకు పీఎఫ్‌ నంబర్లు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేశారు. వారంలో ఒకరోజు సెలవు ప్రకటించడం అభినందనీయమన్నారు. కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌, సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌, ప్రతినిధులు రాజనర్సు, నారాయణ, అంజయ్య, దీవెన తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని