నిధులకు మించి ప్రతిపాదనలు
ఆస్తి మూరెడు... ఆశ బారెడు అన్న చందంగా మారింది బల్దియాల్లో పరిస్థితి. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెల నిధులు వస్తాయన్న ఆశతో భారీస్థాయిలో పనులు ప్రతిపాదించి.. ఇప్పుడు చేసిన వాటికి బిల్లులు చెల్లించలేక పురపాలికలు చతికిలపడుతున్నాయి.
బిల్లులు రాక నిలిచిన పనులు
బల్దియాల్లో కుంటుపడుతున్న ప్రగతి
న్యూస్టుడే, బోధన్ పట్టణం
బోధన్లో పట్టణ ప్రగతిలో నిర్మిస్తున్న వైకుంఠధామం
ఆస్తి మూరెడు... ఆశ బారెడు అన్న చందంగా మారింది బల్దియాల్లో పరిస్థితి. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెల నిధులు వస్తాయన్న ఆశతో భారీస్థాయిలో పనులు ప్రతిపాదించి.. ఇప్పుడు చేసిన వాటికి బిల్లులు చెల్లించలేక పురపాలికలు చతికిలపడుతున్నాయి.
బోధన్లోని పలు కాలనీల్లో ప్రతిపాదిత పనులు కాకపోవడంతో కౌన్సిలర్లలో అసంతృప్తి పెరిగిపోయి అధికారులను నిలదీశారు. ఇదే సమస్యతో బల్దియా సమావేశం వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ దుస్థితి అన్ని పురపాలికల్లో ఉండటం గమనార్హం.
స్థానిక ఆదాయ వనరులు బల్దియాల నిర్వహణకే సరిపోవడంలేదు. పొరుగుసేవల సిబ్బందికి ఒక్కోసారి రెండు నెలల వరకు వేతనాలు చెల్లించలేకపోతున్నారు. పల్లెల విలీనం, విస్తరిస్తున్న కాలనీలతో నీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటుతో విద్యుత్తు వినియోగం పెరిగింది. ఈ బిల్లులు చెల్లించడానికి తడబడుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థకు పనిభారం పెరిగింది. ఇది నిధుల వ్యయంపైనా ప్రభావం చూపిస్తోంది. పట్టణ ప్రగతి నిధులు కాస్త ఉపశమనం కలిగించిందనుకుంటే వాటాలో కోత సమస్యగా మారింది.
ముందుకు రాని గుత్తేదారులు
ప్రభుత్వం 2020లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లకముందు కొత్త పురపాలక చట్టం-2019 ని తీసుకొచ్చింది. దీని ఆధారంగా ప్రతినెల పట్టణ ప్రగతి పేరుతో నిధులు కేటాయించాలి. అలా ప్రతి మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను కలిపి జనాభా ప్రాతిపదికన మంజూరు చేస్తోంది. ఇవి తొలి ఏడాదితో పోలిస్తే క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర, కేంద్ర వాటాలు తగ్గుతుండటంతో ప్రగతిపై ప్రభావం పడుతోంది. చేసిన పనులకు బిల్లులు రాక గుత్తేదారులు కొత్తవి చేయడానికి ముందుకు రావడంలేదు.
బోధన్ బల్దియా : నెలకు రూ.72 లక్షల చొప్పున కొద్ది నెలలు వచ్చాయి. ఆ తర్వాత రూ.55 లక్షలు, రూ.46 లక్షలు.. ఇలా నిధుల మంజూరు హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మేలో రాష్ట్ర, కేంద్ర వాటాలు కలిపి రూ.54 లక్షల చొప్పున వచ్చాయి. జూన్, జులైలో రూ.28 లక్షల రాష్ట్ర వాటా మాత్రమే విడుదలైంది. కేంద్రం నుంచి రాలేదు. వచ్చిన వాటిల్లో నుంచి విద్యుత్తు బిల్లులే రూ.16 లక్షలు చెల్లిస్తున్నారు. నిధులపై ఆశతో పాలకవర్గ సభ్యులు రెండున్నరేళ్లలో దాదాపుగా రూ.12 కోట్లకు పైగా పనులకు ప్రతిపాతించారు. వాటిలో సగానికి పైగా టెండర్లు నిర్వహించగా.. రూ.4 కోట్ల వరకు పూర్తయ్యాయి. రెండు నెలలుగా కొత్త ప్రతిపాదనలు నిలిపివేశారు. పాతబకాయిలు వచ్చే వరకు కొత్తవి చేయబోమని గుత్తేదారులు స్పష్టం చేశారు.
కామారెడ్డి : ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్, జులైలో రూ.56 లక్షల చొప్పున విడుదలయ్యాయి. మొత్తం రూ.11.20 కోట్ల పనులు చేపట్టారు. ఇంకా గుత్తేదారులకు రూ.5.20 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది.
ఆర్మూర్ : గతంలో నెలకు రూ.29 లక్షలు వచ్చేవి. ఇప్పుడు రూ.23 లక్షలు వస్తున్నాయి. వీటిలో రూ.15 లక్షలు విద్యుత్తు బిల్లులకే చెల్లిస్తున్నారు. మిగతావి హరితహారం, పారిశుద్ధ్యానికి ఖర్చు చేస్తున్నారు. ప్రగతి పనులకు నిధుల లేమి ఏర్పడుతోంది.
నిజామాబాద్ : నగర పాలక సంస్థకు ప్రతినెల రూ.1.50 కోట్లు వచ్చేవి. రెండు నెలల కిందట రూ.1.10 కోట్లు వచ్చాయి. చెల్లించాల్సిన బకాయిలేవీ లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి.
* భీమ్గల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లోనూ నిధుల్లో కోత అభివృద్ధి పనులపై ప్రభావం చూపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పురపాలక ఛైర్మన్పై అవిశ్వాసం
[ 24-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక ఛైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని భారాస పార్టీ కౌన్సిలర్లు తీర్మానించినట్లు తెలుస్తుంది. -
కాంగ్రెస్లో చేరిన పుర ఛైర్మన్
[ 24-04-2024]
పుర ఛైర్మన్ సత్యనారాయణ సంగారెడ్డిలో బుధవారం తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వారికి కాంగ్రెస్ కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు. -
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్