మళ్లీ మోగిద్దామా నీటి గంట
మార్కులే లక్ష్యమైన విద్యా వ్యవస్థలో తీవ్రమైన జబ్బు చేసే దాకా విద్యార్థుల ఆరోగ్యస్థితిని సమీక్షించే పరిస్థితి లేదు.
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్: మార్కులే లక్ష్యమైన విద్యా వ్యవస్థలో తీవ్రమైన జబ్బు చేసే దాకా విద్యార్థుల ఆరోగ్యస్థితిని సమీక్షించే పరిస్థితి లేదు. తల, కడుపు నొప్పి, నీరసం వంటి ప్రాథమిక లక్షణాలు గుర్తించి.. సరిపడా నీరు తీసుకోవడంలేదని హెచ్చరిస్తున్నా అవగాహనా రాహిత్యంతో తేలిగ్గా తీసుకుంటున్నారు. మరీ ఎక్కువ జబ్బు చేస్తే.. నీళ్లు బాగా తాగించాలని వైద్యులు చెప్పే వరకు కళ్లు తెరవడంలేదు. ఈదశ దాటితే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనారోగ్యంతో వారి ఏకాగ్రత దెబ్బతిని చదువుపై ప్రభావం పడుతోంది. నివారణకు ఏకైకమార్గం నీటి గంట.
సగమే తీసుకుంటున్నారు
ఉమ్మడి జిల్లాలోనూ 2019లో మన విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో వాటర్బెల్ అమలు చేశారు. కొవిడ్ తరువాత బడులు పునప్రారంభమైనా చాలా రోజులు భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత వంటి నియమాలతో దీనిపై ఎవరూ పెద్దగా స్పందించ లేదు. బడివేళల్లోనే సుమారుగా 1.5 లీటర్ల నీరు తీసుకుంటే మేలన్నది నిపుణుల మాట. 3-4.. లీటర్లు వయసును బట్టి తాగాల్సి ఉండగా... 1.5 లీటర్లే తాగుతున్నారని వైద్యుల అధ్యయనంలో తేలింది.
శీతాకాలంలోనూ అవసరమే
శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి, ఆహారం జీర్ణానికి ఎక్కువ నీటి వినియోగం.. వంటివాటితో శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్కు లోనవుతుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో సరిపడా నీరు తీసుకోవాలన్నది వైద్యుల సూచన.
ఇలా చేయాలి
విద్యార్థులు వెంట నీళ్ల సీసా తెచ్చుకునేలా చూడాలి. బడుల్లో సరిపడా శుద్ధనీటి నిల్వలు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ విద్యాలయాల్లో అవసరమైతే దాతలు నీళ్ల సీసాలు సమకూర్చితే ప్రయోజనం.
పరిమితంతో సమస్యలు
శరీరంలోని అన్ని అవయవాలు సమర్థంగా పనిచేయాలంటే తగిన మోతాదులో నీరు అవసరం. రక్తం పల్చగా ఉండి ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది. మోతాదు తగ్గితే మూత్రపిండాల్లో రాళ్లు, అపెండిక్స్, జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్, అసిడిటీ, మలబద్దకం, మూర్చ, కాలేయ.. చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి.
‘‘ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, ఇంటర్వెల్.. ఇంటి బెల్’’ ఇదీ విద్యార్థుల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన బడి గంటలు. 2019లో కొద్ది రోజులు పరిచయమైన నీటి గంటను అంతా మరిచిపోయారు. ఇటీవల కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ దీన్ని పునఃప్రారంభించాలనే ప్రకటనతో మళ్లీ తెరమీదకొచ్చింది. విద్యార్థులు తగిన మోతాదులో నీటిని తీసుకోకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని కేరళ దీన్ని తొలిసారిగా పరిచయం చేసింది. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన కొద్ది నెలలకే కొవిడ్ లాక్డౌన్తో మూలన పడింది.’’
ప్రధాన కారణాలు ఇవే..
ఎక్కువసార్లు మూత్రం పోవాల్సి వస్తుందని, టీచర్ల భయంతో విద్యార్థులు నీటిని సరిగా తీసుకోవడం లేదు. ఫలితంగా మూత్రంలోని విష లవణాలు శరీరంలోకి తిరిగి చేరుకుని వ్యాధులకు కారణమవుతాయి.
రెండు గంటలకోసారి తాగాలి
- డాక్టర్ శివశంకర్, సూపరింటెండెంట్, బోధన్ జిల్లా ఆస్పత్రి
రెండు గంటలకోసారి 200-250 మి.లీటర్ల నీరు తాగడం మంచిది. అప్పుడే శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. తగినంత నీళ్లు తీసుకోవడం, విసర్జించడం ముఖ్యమనే అవగాహన విద్యార్థుల్లో పెంచాలి.
కేరళలో నిర్ణయించిన ఈ వేళలనే అందరూ అనుసరించారు
* మొదటిసారి నీటి గంట : ఉ।। 10:35
* రెండోసారి : మధ్యాహ్నం 12.00
* మూడోసారి : మధ్యాహ్నం 2.00
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్