మహిళల కల.. భవిష్యత్తు కళకళ
గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఎన్ఆర్ఎల్ఎం(జాతీయ జీవనోపాధుల మిషన్) మార్గనిర్దేశంలో ‘విజన్ బిల్డింగ్(లక్ష్య నిర్దేశం)’ అనే సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్రావు అన్నారు.
‘విజన్ బిల్డింగ్’ రూపకల్పనలో దేశంలోనే జిల్లా ప్రథమస్థానం
సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్రావు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి: గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఎన్ఆర్ఎల్ఎం(జాతీయ జీవనోపాధుల మిషన్) మార్గనిర్దేశంలో ‘విజన్ బిల్డింగ్(లక్ష్య నిర్దేశం)’ అనే సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదర్శ మండల సమాఖ్యల శిక్షణ తరగతుల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయనతో శుక్రవారం ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా సెర్ప్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలతోపాటు విజన్ బిల్డింగ్ ఉద్దేశాలను వివరించారు.
వృద్ధుల సంఘాల ఏర్పాటుకు కసరత్తు
సెర్ప్ ఆధ్వర్యంలో ఒక్కో గ్రామంలో పది వృద్ధుల సంఘాల ఏర్పాటుకు ప్రణాళికలు చేశాం. రాష్ట్రంలోని మహిళా రైతులకు చేయూతనిచ్చేందుకు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని నాలుగు మండలాల్లో వ్యవసాయ పరికరాలు అద్దెకిచ్చే కేంద్రాలు నెలకొల్పాం.
రుణాల సద్వినియోగంతోనే విజయం
స్వశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యల ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తోంది. వాటిని వినియోగించుకుని వారితోపాటు పలువురికి ఉపాధి కల్పించాలనేదే సెర్ప్ లక్ష్యం.
మూడు విభాగాల్లో..
స్వశక్తి సంఘంలోని ప్రతి సభ్యురాలు సొంత లక్ష్యంతోపాటు కుటుంబ, సమాజ కలలను వెల్లడించారు. స్వయం సమృద్ధి సాధించేలా వివిధ వ్యాపార ఆలోచనలను తెలిపారు. కుటుంబ కల విభాగంలో చాలామంది పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని పెట్టుకున్నారు. సమాజ విషయంలో స్ఫూర్తిదాయక ఆలోచనలు చేశారు. ఒక సంఘం వారు తమ మండలంలో గోదాం నిర్మిస్తామని తెలిపారు. దీని ద్వారా రైతులకు దూరం, వ్యయం తగ్గడంతోపాటు తమకూ ఆదాయం వస్తుందన్నారు. మరో బృందం గర్భిణులు, పిల్లల్లో రక్తహీనత నివారిస్తామని పేర్కొన్నారు. ఇందు కోసం అంగన్వాడీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు తమ ఆదాయంలో కొంత అందిస్తామని ముందుకొచ్చారు. వీటిపై డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వారి సమక్షంలో ఒక్కో గ్రామ సంఘం తమ ఆలోచన వెల్లడిస్తాయి.
ప్రణాళికల రూపకల్పన
ఎన్ఆర్ఎల్ఎం దిశానిర్దేశంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విజన్ బిల్డింగ్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. తెలంగాణలో సెర్ప్(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో మొదటి విడతలో ఒక్కో జిల్లాకు మూడు నుంచి నాలుగు మండలాలను ఎంపిక చేసి ఆయా స్వశక్తి సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి బీడీపీ(వ్యాపార ప్రణాళిక), వీఏపీ(వార్షిక ప్రణాళిక)లను సిద్ధం చేస్తున్నాం. వీటి రూపకల్పనలో దేశంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.
పేదరిక నిర్మూలనే ముఖ్యోద్దేశం
ప్రణాళికా లోపంతో స్వశక్తి మహిళల్లో ఆర్థికాభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటోంది. దీనికి తోడు సమాజాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం తగ్గుతోంది. వీటిని పరిష్కరించే సంకల్పంతో విజన్ బిల్డింగ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తెలంగాణలో మొదటగా 112 మండలాల్లో ప్రారంభించాం. జిల్లాలోని భిక్కనూర్, దోమకొండ, బీబీపేట, కామారెడ్డి మండలాల్లో అమలు చేస్తున్నాం. దశల వారీగా అన్ని మండలాల్లో చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామపత్రాల దాఖలుకు ఏర్పాట్లు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరగాల్సిన ప్రాంతాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నామపత్రాల స్వీకరణ ఇదే రోజు ప్రారంభమై ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నిబంధనల మేరకే గుర్తింపునిస్తారా..?
[ 18-04-2024]
నిజామాబాద్లోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలకు సొంత భవనం లేదు. వేరే చోటుకు కళాశాలను తరలించినట్లు గతేడాది తనిఖీకి వెళ్లిన బృందానికి చూపించారు. ప్రైవేటు పాఠశాలలోనే రెండు గదుల్లో బీఈడీ తరగతులు నడిపిస్తోంది. -
1950లో ఫిర్యాదుల స్వీకరణ
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్లకు పలు రూపాల్లో గాలం వేస్తారు. -
‘హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి’
[ 18-04-2024]
పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పడం ఎన్నికల జిమ్మిక్కని నిజామాబాద్ పార్లమెంట్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. -
బలం పెంచుకునేలా వ్యూహాలు
[ 18-04-2024]
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
నామపత్రాల దాఖలుకు వేళాయె
[ 18-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సాంకేతికతతో సమస్యలు అధిగమిద్దాం..!
[ 18-04-2024]
పిల్లలు సాంకేతికతకు బానిసలవుతున్నారా? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఆపద వేళ ఓ బాలిక స్పందించిన తీరు టెక్నాలజీ వినియోగానికి సరైన నిర్వచనాన్ని ఇచ్చింది. -
సువిధతో సులభం
[ 18-04-2024]
ఎన్నికల ప్రచారానికి సంబంధించి సమావేశం నిర్వహించాలంటే ఇది వరకు తెల్ల కాగితంపై రాసి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అధికారులకు సమయం దొరికినప్పుడు అనుమతులిచ్చేవారు. -
ఈసారైనా మోక్షం లభించేనా?
[ 18-04-2024]
బోధన్ - బీదర్ రైల్వేలైన్పై నాయకులు ప్రతి ఎన్నికల్లో హామీలిస్తూ వస్తున్నారు. మరోసారి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు తమ ప్రచారాల్లో రైల్వేలైన్ తీసుకొస్తామని ప్రజలకు మాటిస్తున్నారు. -
పొద్దంతా ఎండ.. రాత్రి వాన
[ 18-04-2024]
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనానికి రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. -
జానకీనాథుడి కల్యాణం.. కమనీయం
[ 18-04-2024]
జగదానందకారకుని దర్శనంతో భక్తజనం తన్మయత్వం చెందారు. సీతారాముల కల్యాణాన్ని పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులే పెళ్లిపెద్దలుగా మారి కన్యాదానం చేశారు. -
విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు
[ 18-04-2024]
బీర్కూర్లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
శిక్షణ.. ఆత్మరక్షణ
[ 18-04-2024]
ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. -
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
[ 18-04-2024]
ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు యువకులకు గాయాలైన ఘటన రూరల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.