logo

సర్పంచి ఇంటి ఎదుట.. దంపతుల ఆత్మహత్యాయత్నం

భూతగాదా వ్యవహారంలో సర్పంచి ఇంటి ఎదుట భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గాంధారి మండలం సోమారంతండాలో శుక్రవారం చోటు చేసుకుంది.

Published : 26 Nov 2022 05:03 IST

గాంధారి, న్యూస్‌టుడే : భూతగాదా వ్యవహారంలో సర్పంచి ఇంటి ఎదుట భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గాంధారి మండలం సోమారంతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... సర్పంచి కిషన్‌నాయక్‌ పదేళ్ల కిందట మండల కేంద్రంలో 250 గజాల స్థలాన్ని కొత్తబాది తండాకు చెందిన దంపతులు బానోత్‌ శంకర్‌, సునీతకు విక్రయించారు. స్థలం తక్కువగా ఉండటం, రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా సమస్య పరిష్కారం కాలేదు. శంకర్‌, సునీత శుక్రవారం సర్పంచి ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయాలని నిలదీశారు. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న గడ్డిమందు తాగారు. బాధితుల బంధువులకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకొని సర్పంచి ఇంటిపై దాడిచేశారు. అనంతరం దంపతులిద్దరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై రాజేశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్లాటు అమ్మిన విషయం వాస్తవమేనని, మొత్తం డబ్బులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్‌ చేయించాలంటూ తనపై దాడికి దిగారని సర్పంచి కిషన్‌ నాయక్‌ ఫిర్యాదు చేశార[న్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని