సన్నాలకే జై
మునుపెన్నడు లేనంతగా ఈసారి బహిరంగ విపణిలో వడ్లకు డిమాండ్ ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఇచ్చే ప్రభుత్వ మద్దతు ధరను మించి కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు.
పోటీపడి కొంటున్న వ్యాపారులు
జైశ్రీరాం రకం క్వింటాకు రూ. 2600
న్యూస్టుడే, ఆర్మూర్ : మునుపెన్నడు లేనంతగా ఈసారి బహిరంగ విపణిలో వడ్లకు డిమాండ్ ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ఇచ్చే ప్రభుత్వ మద్దతు ధరను మించి కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. మొదట్లో కల్లాల మీదే పచ్చి ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపిన వారు ఇప్పుడు సన్నాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి ఎగబడి కొంటున్నారు. ఇది వరకు మిర్యాలగూడ వ్యాపారులు రాగా, ఈసారి కర్ణాటక నుంచి వచ్చి రైతుల కల్లాల్లో వాలిపోతున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కేవలం సగం సరకుతోనే సర్దిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏదీ దక్కనీయడం లేదు
కొనుగోలు కేంద్రాలకు సాధారణ రకంగా అమ్ముడయ్యే సన్నాలు ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదు. ‘ఏ’ గ్రేడ్ క్వింటాకు రూ.2060 పలికే దొడ్డు రకాలే ఇచ్చేందుకు రైతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు హమాలీ రాకున్నా.. లారీ ఆలస్యమైనా బయట వ్యాపారులకే ధర కాస్త అటూఇటుగా అంటగడుతున్నారు. సర్కారు కేంద్రాల్లో హమాలీ ఛార్జీలు, తరుగు, తూకంలో మోసాలు ఎక్కువవడంతో క్వింటాకు రూ.150 వరకు నష్టపోతున్నామని రైతులు ప్రైవేటులో అమ్ముకుంటున్నారు. చాలాచోట్ల మిల్లర్లే దళారులతో రంగంలోకి దిగి బేరమాడుతున్నారు. కేంద్రాల నుంచి వచ్చే వడ్లకు స్థలం లేదనే వారు కూడా ఇప్పుడు ఏదైనా పర్వాలేదని ఆలస్యం చేయకుండా ఆహ్వానిస్తున్నారు.
కర్ణాటక రాకతో..
మన వద్ద కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు రూ.2,060 ఉంటే సరిహద్దున ఉన్న కర్ణాటకలో రూ.2,450 పలుకుతోంది. ఉమ్మడి జిల్లాలో సరిహద్దు రైతులు పొరుగు రాష్ట్రంలోనే అమ్ముకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. రాయచూర్, గుర్మిట్, యాద్గిర్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఎలాంటి హమాలీ ఛార్జీలు, రవాణా ఖర్చులు లేకుండానే రూ. 200-400 అదనంగా చెల్లించి కొంటున్నారు. వరుసగా కురిసిన వర్షాలతో కర్ణాటక, తమిళనాడులో వరి పంట దెబ్బతింది. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది ముందే గుర్తించిన మిర్యాలగూడ వ్యాపారులు బోధన్, ఎడపల్లి, రుద్రూర్, బీర్కూర్, రెంజల్, వర్ని, చందూర్, మోస్రా మండలాల నుంచి 80 శాతం కోతలైన వెంటనే పచ్చి పంట ఎగురేసుకుపోయారు.
సన్నాల సగటు రూ. 2,400
ప్రస్తుతం జైశ్రీరాందే హవా నడుస్తోంది. గరిష్ఠంగా క్వింటాకు రూ.2600, సగటు రూ.2400 అమ్ముడుపోతోంది. తర్వాతి స్థానం హెచ్ఎంటీది. రూ.2200 వరకు సగటు ధరతో కొంటున్నారు. బీపీటీ, గంగాకావేరి సన్నాలు రూ.2,100 తగ్గకుండా పలుకుతున్నాయి. ఏటా రెండో పంటకు దొడ్డు రకాలకే ప్రాధాన్యం ఇచ్చే రైతులు యాసంగిలో మాత్రం సన్నాలకే జై కొడుతున్నారు. రానున్న సీజన్లలోనూ మంచి ధర దక్కుతుందని భావిస్తున్నారు.
రోజురోజుకు పెరుగుదల
- వెంకటేశం, సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి, నిజామాబాద్ యార్డు
నిజామాబాద్ యార్డుకు తెచ్చే ధాన్యంలో తేమశాతం చూసుకుంటే చాలు గిట్టుబాటు వచ్చేస్తుంది. ఈ సారి సన్నాలకు మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరు నగరం.. కాషాయ వనం
[ 24-04-2024]
మనసంతా పవనసుతుని నామ జపం.. తనువంతా ఆధ్యాత్మికం.. అయోధ్య రాముడి బంటుగా.. సీతమ్మ జాడను అందించిన హనుమంతుడిపై ఇందూరు ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. -
ప్రణాళికతో సద్వినియోగం
[ 24-04-2024]
సెలవులు వచ్చాయంటే పిల్లలకు భలే సరదా.. చిందులు, సరదాలు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉరకలేసే సమయం. ఆనందం మాత్రమే చూసుకుంటే ఒక్కోసారి విషాదం, ఆందోళనకు దారి తీయొచ్చు. -
సాగర్లో పూడిక.. తొలగించాలిక
[ 24-04-2024]
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. -
వరికే ప్రాధాన్యం
[ 24-04-2024]
రానున్న వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది సైతం సమృద్ధిగా వానలు పడితే జలాశయాలు నిండి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరివ్వొచ్చనే అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. -
సంగ్రామానికి సమష్టిగా..
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోరు ఊపందుకొంది. అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. -
సమాచారం అరచేతిలో..
[ 24-04-2024]
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం నూతన సంస్కరణలకు నాంది పలికింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. -
బాలాగౌడ్కు అత్యల్పం.. రాంగోపాల్రెడ్డికి అత్యధికం
[ 24-04-2024]
ఎన్నికల్లో ఒక్క ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటుతోనే ఫలితం తారుమారు కావచ్చు. చాలా మంది ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ ఎంపీలు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. -
పోలింగ్శాతంపై అభ్యర్థుల బెంగ
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
ఐదో రోజు తొమ్మిది నామినేషన్లు
[ 24-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఐదో రోజైన మంగళవారం తొమ్మిది మంది నామినేషన్లు వేశారు. అశోక్గౌడ్(బహుజన్ లెఫ్ట్ పార్టీ), పోతు నవీన్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), నాగార్జున్(ప్రజా సేన పార్టీ), ఎండీ.షాహెద్ ఖాన్(ఆలిండియా నేషనల్ పార్టీ), గోలి నరేష్(దళిత బహుజన పార్టీ), శక్తి ప్రసాద్, బీబీ నాయక్, మహ్మద్ జమీల్, సాయికృష్ణ(స్వతంత్ర) నామపత్రాలను రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతుకు అందజేశారు. -
ఓట్లు ఎక్కువ.. ప్రాతినిధ్యం తక్కువ
[ 24-04-2024]
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయ రంగంలోకి వచ్చేసరికి సర్పంచి నుంచి జడ్పీ ఛైర్పర్సన్ వరకు ఇలా వివిధ పదవుల్లో రాణిస్తున్నారు. -
కార్యకర్తలపైనే ప్రచార బాధ్యతలు
[ 24-04-2024]
నామపత్రాల దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గతానికి భిన్నంగా జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారి త్రిముఖపోరు నెలకొంది. -
పర్యవేక్షిస్తేనే ఆదాయం
[ 24-04-2024]
బల్దియాల నుంచి అనుమతులు పొందకుండానే ప్రధాన కూడళ్లతోపాటు ఆయా రోడ్ల పక్కన ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఈ దిశగా అడుగులు పడటంలేదు. -
200 మందికి ఉపాధి లక్ష్యం
[ 24-04-2024]
గ్రామాల్లో ఉపాధి పనుల జోరు పెంచాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి గ్రామ పంచాయతీలో 200 మంది కూలీల కంటే ఎక్కువగా హాజరు ఉండాలని పేర్కొంది. దీంతో జిల్లా యంత్రాంగం ఉపాధి కూలీల సంఖ్య పెరగడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం