పాస్పోర్టులో ఇంటిపేరు తప్పనిసరి
గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఇకపై పాస్పోర్టు ఉంటే సరిపోదు. అందులో ఇంటి పేరుతో సహా పక్కాగా ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఇంటిపేరు లేకుంటే వీసా ఉన్నా ఇమిగ్రేషన్ పూర్తికాదు.
కొత్త నిబంధన అమలు చేసిన యూఏఈ
న్యూస్టుడే - ఇందూరు సిటీ: గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఇకపై పాస్పోర్టు ఉంటే సరిపోదు. అందులో ఇంటి పేరుతో సహా పక్కాగా ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఇంటిపేరు లేకుంటే వీసా ఉన్నా ఇమిగ్రేషన్ పూర్తికాదు. కంపెనీ, సందర్శక వీసాలపై వెళ్లేవారందరికీ కూడా ఈ నిబంధన వర్తించనుంది. ఈ మేరకు దేశంలోని పలు విమానయాన సంస్థలు సైతం తమ ఏజెంట్లకు నూతన మార్గదర్శకాలను జారీ చేశాయి.
* ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో 4 లక్షలు పైబడి వలస కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ రంగం, హోటళ్లు, విమానాశ్రయాలు, పరిశ్రమల్లో వీరంతా పని చేస్తున్నారు. కొందరు ఏళ్లుగా అక్కడే ఉండిపోయారు. చాలా మంది పాస్పోర్టుల్లో ఇంటిపేర్లు లేవు. కొందరికి ఇంటిపేరుకు బదులుగా కేవలం మొదటి అక్షరం మాత్రమే ఉంది. వీరందరికి భవిష్యత్తులో చిక్కులు తప్పవని తెలుస్తోంది.
* యూఏఈలోని నేషనల్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సూచనల మేరకు ప్రస్తుతానికి యూఈఏ నూతన నిబంధనలు విధించింది. ఇక్కడ జిల్లాకు చెందిన వారు లక్ష మంది ఉంటారని సమాచారం. ఇప్పటినుంచి యూఏఈ వెళ్లాలనుకొనే వారి పాస్పోర్టులు తాజా నిబంధనల ప్రకారం ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 23-04-2024]
ధర్మారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మన పార్లమెంటు మహోన్నతం
[ 23-04-2024]
దేశమంతా సార్వత్రిక ఎన్నికల సంగ్రామంతో హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఫలితమెలా ఉంటుందని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది -
పద..పార్టీ మారుదాం !
[ 23-04-2024]
రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కిందిస్థాయి క్రీయాశీలక కార్యకర్తల వరకు ఒక్కొక్కరు తమకు అనుకూలంగా ఉండే పార్టీల వైపు క్యూ కడుతున్నారు. -
ఓటరే లక్ష్యం.. అస్త్రాలు సిద్ధం
[ 23-04-2024]
పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు -
12 లో ఫెయిల్ జీవితంలో గెలుపు
[ 23-04-2024]
పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణతే మైలురాయి కాదు. విద్యాలయాలకు వెళ్లకపోయినా దూర విద్యలోనూ డిగ్రీలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడినవారున్నారు. పరిమిత వనరుల్లోనూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి -
పోరు.. ఇక హోరు
[ 23-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
ఓటరు తీర్పు విభిన్నం..
[ 23-04-2024]
కామారెడ్డి జిల్లా ప్రజలకు జహీరాబాద్, మెదక్ లోక్సభ స్థానాలతో అనుబంధం ఉంది. ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. -
వీడని వాన
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాను అకాల వర్షాలు వీడటం లేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వరుసగా కురుస్తున్న వానలు అన్నదాతలకు కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడింది. -
బోధన్ - మహబూబ్నగర్ ప్యాసింజర్ రద్దు
[ 23-04-2024]
నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మహబూబ్నగర్ మధ్య నడిచే రైలును మే 16 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వు జారీ చేశారు -
2.30 లక్షల మె.ట.ధాన్యం కొనుగోలు
[ 23-04-2024]
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది -
కాంగ్రెస్ శ్రేణుల్లో హుషారు
[ 23-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి