అంగన్వాడీ కేంద్రంలో కుక్కర్ పేలి చిన్నారికి తీవ్ర గాయాలు
మండల కేంద్రంలోని ఓ అంగన్వాడీ పాఠశాలలో శనివారం కుక్కర్ పేలి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఎడపల్లి: మండల కేంద్రంలోని ఓ అంగన్వాడీ పాఠశాలలో శనివారం కుక్కర్ పేలి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అంగన్వాడీ కేంద్రంలో ఆయా ఆహారం ఏర్పాటు చేసి పిల్లలకు అందించింది. వారు ఆహారం తింటున్న క్రమంలో ఆ పక్కనే ఉన్న గ్యాస్ పొయ్యిపై పప్పు ఉడుకుతున్న కుక్కర్ ఒక్కసారిగా పేలి కిందపడింది. దీంతో అక్కడే ఉన్న చిన్నారి అనూషపై వేడినీళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో పాప పొట్ట వేడినీళ్లు పడి తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. అనంతరం బాధితురాలిని బోధన్లోని ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా