వెలుగులోకి వీరుల త్యాగాలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీ(డీడీఆర్) ప్రాజెక్టు చేపట్టింది.
సీసీఆర్టీ ఆధ్వర్యంలో వివరాల సేకరణ
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ డిస్ట్రిక్ట్ రిపోజిటరీ(డీడీఆర్) ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి జిల్లాకు చెందిన వ్యక్తులు, సంఘటనలు, జీవన సంప్రదాయాలు, కళారూపాలు, దాచిన నిధులు, కోటలు, మ్యూజియాలు, సహజ వారసత్వాలపై ఫొటోలు, స్కెచ్, చిన్న నిడివి గల వీడియోలతో పాటు ఆంగ్లంలో కథనాలు ఆహ్వానిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రణాళిక, అమలు తీరుపై ప్రత్యేక కథనం.
కార్యాచరణ ఇలా..: రాష్ట్రాల వారీగా ఇద్దరు రిసోర్సు పర్సన్లను ఎంపిక చేసి మొత్తం 25 మంది ఉపాధ్యాయులకు అక్టోబరు 11-13వ తేదీల్లో దిల్లీలో కార్యశాల నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన గన్నారం ప్రభాకర్, సిద్దిపేటకు చెందిన రాజమల్లు శిక్షణ పొందారు. వీరిద్దరూ నవంబరు 11, 12వ తేదీల్లో హైదరాబాద్లోని సీసీఆర్టీ ప్రాంతీయ కేంద్రంలో 100 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వీరికి ఆయా జిల్లాలోని అంశాలను ఆంగ్లంలో డిజిçËలైజ్ చేసే బాధ్యతను అప్పగించారు.
* ప్రాజెక్టు విజయవంతం కోసం సీసీఆర్టీ స్కాలర్షిప్ హోల్డర్లు, యంగ్ స్కాలర్ ఆర్టిస్ట్లు, పూర్వ విద్యార్థులు, సీసీఆర్టీ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, జిల్లా రిసోర్స్ పర్సన్లతో పాటు ఆసక్తి కలిగిన వారెవరైనా భాగస్వాములు కావొచ్చు.
ఇవి తప్పనిసరి.. కథనాలు సేకరించే సమయంలో దానికి సంబంధించిన నిర్ధారణకు పలు సూచనలిచ్చారు. గ్యాలంటరీ అవార్డులు, ఒకటో, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అందుకున్న టెస్టిమోనియల్, ఐఎన్ఏలో పాల్గొనడం, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, 1972లో భారత ప్రభుత్వం ప్రదానం చేసిన తామ్రపత్రాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపులను తప్పనిసరిగా పంచుకోవాలి.
* జిల్లా నుంచి డీడీఆర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో ఒకే ఒక కథనం ప్రచురితమైంది. ఎం.నారాయణరెడ్డికి సంబంధించి.. 2020లో ఐఏఎస్ అధికారి మకరంద్ పొందుపర్చినట్లు తెలుస్తోంది.
మార్గదర్శకాలు..
సేకరించాల్సిన విషయం, స్వభావంపై సీసీఆర్టీ పలు మార్గదర్శకాలను రూపొందించింది. వ్యక్తులు, వ్యక్తిత్వాలు తదితర అంశాలపై ఆంగ్లంలో కథనాలు రాసి అనుబంధంగా చిత్రాలు/ఫొటోలు/చిన్న నిడివి కలిగిన వీడియోలతో డీడీఆర్ రూపొందించిన ప్రమాణపత్రాన్ని జత చేసి akam–ccrt@gov.in కు ఈ-మెయిల్, స్పీడ్ పోస్టులో పంపొచ్చు. భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి కథనం కనీసంగా 150 పదాలకు మించి ఉండాలి. కథ మూలాన్ని అందించడం తప్పనిసరి. ఇతర చోట్ల ప్రచురించిన కథనాలను అంగీకరించరు.
గుర్తింపుతో పాటు గౌరవ వేతనం
గన్నారం ప్రభాకర్, డీఆర్పీ, నిజామాబాద్
ఒక్కో కథనానికి గుర్తింపు ధ్రువపత్రంతో పాటు రూ.2 వేల గౌరవ వేతనం పొందవచ్చు. ఇప్పటివరకు పలువురు ఉపాధ్యాయులతో కలిసి 40 కథనాలు వెలికితీశాం. వివరాలకు 94406 59174 నంబర్లో సంప్రదించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా