సమృద్ధిగా జలం.. ఆయకట్టుకు ఫలం
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరదతో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి.
యాసంగిలో పెరగనున్న వరిసాగు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి: ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వచ్చిన వరదతో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్లో నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో జరిగిన శివం కమిటీ సమావేశంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను నిర్ధారించుకుని ఆయకట్టుకు విడుదల చేయాలని నిర్దేశించారు. యాసంగి సీజన్లో వానాకాలం మించి వరి సాగయ్యే అవకాశాలున్నాయి.
తొమ్మిది టీఎంసీలు
నిజాంసాగర్ జలాశయం నుంచి యాసంగి సీజన్కు తొమ్మిది టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు. అలీసాగర్(డిస్ట్రిబ్యూటరీ-49) వరకు కాలువల ద్వారా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో 15 రోజులకోమారు విడుదల చేయనున్నారు. తదనంతరం పది రోజులకోమారు వదులుతారు. డిసెంబరు 20- 25 మధ్య నీటి విడుదల ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈసారి రెండు జోన్లకు ...
నిబంధనల మేరకు ఈ ఏడాది ఏ- జోన్ పరిధిలోని ఆయకట్టుకు నీటి విడుదల లేనప్పటికీ ప్రాజెక్టు సమృద్ధిగా ఉండడంతో రెండు జోన్ల పరిధిలోని ఆయకట్టుకు పంపిణీ చేసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయకట్టు పరిధిలోని 27 గొలుసుకట్టు చెరువుల్లోనూ సమృద్ధిగా నీరుంది.
మొదటిసారి రెండో పంటకు
కొన్నేళ్లుగా ఎగువ ప్రాంతం నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టు నిండలేదు. గతేడాది నిండినప్పటికీ యాసంగి ప్రారంభమయ్యే నాటికి సగం విడుదల చేశారు. యాసంగి మొత్తానికి సరఫరా కాలేదు. ఈ ఏడాది తొలిసారిగా మొత్తం ఆయకట్టు రెండో పంటకు సాగునీరు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పంట కాల్వలతో పాటు ప్రధాన కాలువ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు.
త్వరలో విడుదల చేస్తాం
శ్రీనివాస్, సీఈ, నీటిపారుదలశాఖ కామారెడ్డి
వచ్చే నెల మొదటి వారంలో నిజామాబాద్ కేంద్రంలో జరగనున్న డీఐఏబీ సమావేశంలో సాగునీటి విడుదల ప్రణాళిక విడుదల చేస్తాం. ప్రాజెక్టుల్లో జలం సమృద్ధిగా ఉంది. రెండో పంటకు అవసరమైన మేర సాగునీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులు యాసంగి పంటల సాగుకు సమాయత్తం కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
పుస్తకంతో దోస్తీ చేద్దామా..?
[ 20-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లల అల్లరి నియంత్రించేందుకు తల్లిదండ్రులు చేసేది.. సెల్ఫోన్ ఇచ్చి ఒక చోట పరిమితం చేయడం. కానీ దాంతో కంటి చూపు మందగించడం, మానసిక సమస్యల వంటి దుష్పరిణామాలను గ్రహించలేకపోతున్నారు. -
‘నగరాభివృద్ధిపై భారాస ప్రభుత్వం వివక్ష’
[ 20-04-2024]
భారాస ప్రభుత్వ హయాంలో నగరాభివృద్ధిపై పూర్తి వివక్ష చూపారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
రెండో రోజు.. ఆరుగురు
[ 20-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండో రోజైన శుక్రవారం ఆరు నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలైన భారాస, భాజపా అభ్యర్థులున్నారు. -
బడుల బలోపేతానికి కృషి
[ 20-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ‘మన ఊరు మన బడి కింద’ ఎంపికైంది. ఇక్కడ వంట గదులు సక్రమంగా లేవు. ఏళ్ల నాటి గదుల్లోనే వంట చేస్తున్నారు -
హలో పురపాలిక
[ 20-04-2024]
‘హలో మేము పాత బాన్సువాడ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ పైపులైను పగిలి నీటి సమస్యగా మారింది. దీన్ని త్వరగా పరిష్కరించేలా చొరవ తీసుకోండి -
సమస్యలు అటుంచి.. విధానాలే ముందుంచి
[ 20-04-2024]
శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోక్సభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. -
వడగళ్ల వాన.. వణికిన రైతన్న
[ 20-04-2024]
వడగళ్ల వాన జిల్లాను మరోసారి వణికించింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో వాన కురిసింది -
ప్రమాదాల కాలం.. అప్రమత్తతతోనే పదిలం
[ 20-04-2024]
ఎండలు మండుతుండడంతో ఏప్రిల్, మే నెలల్లో అగ్నిప్రమాదాలకు ఆస్కారముంది. నాలుగు నెలల కిందట కామారెడ్డి జిల్లాకేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో రెండు రోజులకు గానీ మంటలు అదుపులోకి రాలేదు -
ఈ- కేవైసీకి మరో అవకాశం
[ 20-04-2024]
రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకునేందుకు అధికారులు మళ్లీ అవకాశం కల్పించారు. గతంలో మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇంకా 19 శాతం మంది ప్రక్రియ పూర్తిచేసుకోలేదు. -
ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి
[ 20-04-2024]
ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. -
గొలుసుకట్టు చెరువులు నిండేదెట్లా?
[ 20-04-2024]
వృథా నీటిని చెరువుల్లోకి మళ్లించేందుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం చేపట్టిన లక్ష్యం నిధుల కొరతతో ఆచరణకు నోచుకోవడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు