logo

అటవీ భూమి విషయమై ఘర్షణ

పోడు భూమి విషయమై నాలుగు కుటుంబాలు ఘర్షణపడ్డ ఘటన ఎల్లారెడ్డి మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 30 Nov 2022 06:21 IST

ఎల్లారెడ్డి పురపాలిక, న్యూస్‌టుడే: పోడు భూమి విషయమై నాలుగు కుటుంబాలు ఘర్షణపడ్డ ఘటన ఎల్లారెడ్డి మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కట్టకిందితండాలో ఈ నెల 26న పోడు గ్రామసభ నిర్వహించారు. ఓ భూమి నాలుగు కుటుంబాల వారి కాస్తులో ఉన్నట్లు సభలో తీర్మానించారు. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి వీరు సాగు చేసిన పొలంలోని చెరకు పంటకు నిప్పు పెట్టాడు. దీంతో నాలుగు కుటుంబాల సభ్యులు మంగళవారం రాత్రి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కర్రలతో ఘర్షణకు దిగారు. వారిని ఆపేందుకు వెళ్లిన బర్మావత్‌ రాజు అనే వ్యక్తిపై దాడి చేయడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై గణేశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. గొడవ జరుగుతుండగా 100కు ఫిర్యాదు రావడంతో సిబ్బందిని వెంటనే పంపామని తెలిపారు. విచారణ చేపడతామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని