వైకల్యం జయించి.. పతకాలు సాధించి
నోట్లో ముద్ద పెట్టుకోవడానికి సహకరించని చేతులు.. ఉబికి వచ్చే కన్నీళ్లను తుడుచుకోలేని దుస్థితి. అయ్యో! వీడి జీవితం ఇలా అయ్యిందేనని తల్లిదండ్రుల మనసులో గూడుకట్టుకున్న నిరాశ..
పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో బాలుడి సత్తా
న్యూస్టుడే, నిజామాబాద్ క్రీడావిభాగం
2017లో బీఎస్ఎఫ్ డీజీ కిషన్కుమార్శర్మతో శ్రీనికేష్
నోట్లో ముద్ద పెట్టుకోవడానికి సహకరించని చేతులు.. ఉబికి వచ్చే కన్నీళ్లను తుడుచుకోలేని దుస్థితి. అయ్యో! వీడి జీవితం ఇలా అయ్యిందేనని తల్లిదండ్రుల మనసులో గూడుకట్టుకున్న నిరాశ.. జాలిగా చూసే జనాలు. జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న సమయంలో దొరికిన ఆధారంతో జాతీయ స్థాయిలో సత్తా చాటి తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు నిజామాబాద్ నగరం గౌతమ్నగర్కు చెందిన దివ్యాంగ బాలుడు శ్రీనికేష్ కిరణ్.
తండ్రి కిరణ్కుమార్ బీఎస్ఎఫ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి శ్రీవాణి గృహిణి. 2008లో శ్రీనికేష్ రెండు చేతులు పూర్తి ఆకృతిలో లేకుండా పుట్టాడు. కిరణ్కుమార్ విధి నిర్వహణలో భాగంగా బెంగళూరులో ఉంటున్నారు. అక్కడి కేంద్రీయ విద్యాలయంలో బాలుడు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
మలుపు తిప్పిన ఘట్టం..: దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా తమకంటూ ప్రత్యేకత చాటుకునేలా 2017లో బీఎస్ఎఫ్ డీజీ కిషన్కుమార్శర్మ పలు కార్యక్రమాలు రూపొందించారు. సదరు అధికారి సూచనతో తల్లిదండ్రులు బాబుకు ఈత, చిత్రలేఖనం, షూటింగ్లో శిక్షణ ఇప్పించారు.
సాధించిన పతకాలు..: ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన 21వ జాతీయ పారా ఈత పోటీల్లో శ్రీనికేష్ మూడు పతకాలు సొంతం చేసుకున్నాడు. ఇటీవల అస్సాంలో నిర్వహించిన 22వ జాతీయ పోటీల్లో 400 మీ. ఫ్రీస్టైల్ విభాగంతో పాటు 50 మీ. బ్యాక్స్ట్రోక్లో రెండు స్వర్ణాలు, 50 మీ. బ్రెస్ట్స్ట్రోక్లో రజతం అందుకున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా బీఎస్ఎఫ్ నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో మొదటిస్థానంలో నిలిచాడు. బీఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి అందరి మన్ననలు పొందాడు.
ఎప్పుడూ బాధపడను: - శ్రీనికేష్ కిరణ్
ఈ విజయాలు ఎంతో స్ఫూర్తిని నింపా యి. దివ్యాంగుడినని నేనెన్నడూ బాధపడను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే అంతర్జాతీయ వేదికపై సత్తాచాటి దేశానికి పతకాలు సాధిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం