పోడు.. తిరస్కరణల జోరు
జిల్లాలో పోడు భూముల హక్కుపత్రాలకు అధిక శాతం అనర్హులే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.
దరఖాస్తుల్లో అనర్హులవే ఎక్కువ
నేటి నుంచి డివిజన్ స్థాయి సమావేశాలు
ఈనాడు డిజిటల్, కామారెడ్డి
జిల్లాలో పోడు భూముల హక్కుపత్రాలకు అధిక శాతం అనర్హులే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. 27,075 మంది 68,505 ఎకరాలకు అర్జీలు పెట్టుకోగా.. 90శాతానికి పైగా ఆర్వోఎఫ్ఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. సాగులో లేని అటవీ భూములను దరఖాస్తులో చేర్చారు. దీనికి తోడు అటవీ హక్కుల చట్టం నిర్దేశించిన మేర అవసరమైన ధ్రువపత్రాలు జతపరచలేదు. గిరిజనేతరులైతే మూడు దశాబ్దాలుగా సాగు చేస్తున్నట్లు ఆధారాలు చూపించలేకపోతున్నారు. ఈ మేరకు గ్రామసభల్లో తిరస్కరణకు గురయ్యాయి.
పూర్తయిన గ్రామసభలు
క్షేత్రపరిశీలన అనంతరం పోడు దరఖాస్తులపై సమగ్ర వివరాల సేకరణ నిమిత్తం వారం రోజులుగా నిర్వహిస్తున్న గ్రామసభలు ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 354 ఆవాసాల్లో సభలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ వివరాల ఆధారంగా దరఖాస్తుల్లో తిరస్కరణ గురైనవి పోగా మిగిలిన వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
పునఃపరిశీలనకు అవకాశం
ఒకవేళ గ్రామసభలో దరఖాస్తులను తిరస్కరిస్తే 60 రోజుల్లోపు సదరు రైతులు ఆర్డీవో ఆధ్వర్యంలోని డివిజన్ స్థాయి కమిటీకి మళ్లీ విన్నవించుకునే వీలుంది. అక్కడా తిరస్కరిస్తే జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కొనసాగే జిల్లా కమిటీకి అర్జీ పెట్టుకోవచ్చు. హక్కుపత్రాల జారీలో తుది నిర్ణయం జిల్లా కమిటీదే. కొత్తగా దరఖాస్తులకు అవకాశం లేదు.
ఆర్డీవో నేతృత్వంలో..
అటవీహక్కుల చట్టం ప్రకారం గ్రామసభల అనంతరం పోడు దరఖాస్తులను ఆర్డీవో నేతృత్వంలోని డివిజన్ స్థాయి కమిటీ సమావేశంలో పరిశీలించాల్సి ఉంటుంది. జిల్లాలో మూడు డివిజన్లు ఉండగా మొదటగా బాన్సువాడ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజుకు 20 గ్రామాల దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించారు. అనంతరం కామారెడ్డి, ఎల్లారెడ్డిలో చేపడతారు. వీటి అనంతరం హక్కుపత్రాల జారీకి అర్హత సాధించిన దరఖాస్తులను జిల్లా కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. కలెక్టర్ నేతృత్వంలో వాటిని ఆమోదించి అటవీ హక్కుపత్రాలు జారీ చేస్తారు.
354 ఆవాసాల్లో చేపట్టాం
- అంబాజీ, గిరిజన సంక్షేమాధికారి, కామారెడ్డి
పోడు దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అటవీ హక్కుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 354 ఆవాసాల్లో గ్రామసభలు నిర్వహించాం. ఇక డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 19-04-2024]
తాండూరు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి 6 గ్యారంటీలు, రుణమాఫీ గురించి స్థానిక కాంగ్రెస్ నాయకులు వివరించారు. -
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల