నగరానికి నలు వైపులా..
‘నిజామాబాద్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజల సౌకర్యార్థం నగరం నలు వైపులా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలి’.. అని ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మార్కెట్లకు ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు
న్యూస్టుడే, నిజామాబాద్ నగరం
అహ్మదీబజార్లో కొనసాగుతున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు
‘నిజామాబాద్ రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజల సౌకర్యార్థం నగరం నలు వైపులా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలి’.. అని ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ అధికారులు స్థలాల అన్వేషణలో నిమగ్నమయ్యారు. అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
* అహ్మదీబజార్లో.. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వారు జిల్లాకేంద్రానికి వచ్చి స్థిరపడుతున్నారు. అందుకు అనుగుణంగా మార్కెట్లు లేవు. గతంలోనే నాలుగు ఏర్పాటు చేయాలని భావించినా.. బోధన్రోడ్డులోని అహ్మదీబజార్లో మాత్రమే సమీకృత మార్కెట్ నిర్మిస్తున్నారు. దీనికి రూ.4 కోట్లు వెచ్చిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తికావాల్సి ఉండగా మొదట్లో నెమ్మదిగా సాగాయి.
* పాత భవనాలు కూల్చివేత: నగరంలో కీలక ప్రాంతమైన ఖలీల్వాడీలోనూ మార్కెట్ అవసరం ఉందని అధికారులు గుర్తించారు. పాత తహసీల్ కార్యాలయం, దాని పక్కనే ఉన్న సర్వే ల్యాండ్ రికార్డు భవనం, ఆర్డీవో కార్యాలయాలను తొలగించి ఇక్కడ నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాత భవనాలను కూల్చివేశారు. రూ.4 కోట్లతో కూరగాయలు, మటన్, చికెన్, చేపల విక్రయాల కోసం 120 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వాహనాల పార్కింగ్ కోసం పాత డీఈఓ కార్యాలయ ఆవరణను కేటాయించారు.
* స్థలాల కోసం అన్వేషణ: హైదరాబాద్ రోడ్డులోని వినాయక్నగర్, ఆర్మూర్ మార్గంలోని గంగాస్థాన్, వర్ని రోడ్డు వైపు మూడు సమీకృత మార్కెట్ల కోసం స్థలాలు చూస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు ఉంటే.. వాటిని గుర్తించి అప్పగించాలని తహసీల్దార్లను ఆదేశించారు. గంగాస్థాన్, బోర్గాం(పి) వద్ద అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అర్బన్ ఎమ్మెల్యే నిరంతరం బల్దియా ఇంజినీరింగ్ అధికారులతో చర్చిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఇక జోరు
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
సిద్ధమవుతున్నారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. -
‘వ్యాపార కాంక్షతోనే బీబీపాటిల్ పోటీ’
[ 19-04-2024]
తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకే బీబీపాటిల్ ఎంపీగా పోటీచేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విమర్శించారు. -
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ
[ 19-04-2024]
రైతులకు ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
లక్ష్యం అధిగమించి.. ఆర్థికంగా ఎదిగి
[ 19-04-2024]
మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తోంది. ఈ అవకాశాన్ని చాలా మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
ఇక ప్రచార హోరు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఇక హోరెత్తనుంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచేందుకు సిద్ధమయ్యారు. -
బీఫాం అందుకున్న బాజిరెడ్డి
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు అధినేత కేసీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఫాం అందజేశారు. -
రూ.52.71 లక్షల నగదు.. 16,547 లీటర్ల మద్యం పట్టివేత
[ 19-04-2024]
సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. -
ఇద్దరు సీఐలపై వేటు
[ 19-04-2024]
కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్ సీఐ ప్రేమ్కుమార్ సస్పెండ్ చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన సాహిల్
[ 19-04-2024]
హైదరాబాద్ పంజాగుట్ట వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. -
అరచేతిలో ఎన్నికల సమాచారం
[ 19-04-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బుల పంపిణీ చేస్తే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? -
‘పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి’
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉందని’ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబుకు విజ్ఞప్తి చేశారు. -
హ్యాట్రిక్ వీరులు ఇద్దరు
[ 19-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. -
విద్యార్థులు.. సైబర్ రక్షకులు
[ 19-04-2024]
పెరిగిన సాంకేతికత, చరవాణులు అందరికీ చేరువై అన్ని రంగాల్లో సేవలు సులభమయ్యాయి. కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత డేటా, ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు డబ్బులు అపహరిస్తున్నారు. -
ఆకాశవాణి మీకోసం..
[ 19-04-2024]
పిల్లలూ.. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మొదలుకానున్నాయి.. ఇంటి వద్దే ఉంటూ చరవాణిలో వీడియో గేమ్స్ ఆడుకుంటూ సమయాన్ని వృథా చేయకండి. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు
[ 19-04-2024]
ట్రాక్టర్ నడుపుకొంటూ జీవనం సాగించే వ్యక్తి అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేసి తనిఖీల్లో ఒకటో ఠాణా పోలీసులకు దొరికిపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!