ఆరోగ్య ఆర్టీసీ
రీజియన్ పరిధిలో డిపోల వారీగా తొలి విడతలో 6 వైద్య శిబిరాలు నిర్వహించారు. 3,210 మంది ఉద్యోగులు, సిబ్బందికి 17 రకాల పరీక్షలు చేశారు. ఫలితాల ఆధారంగా వారిని నాలుగు విభాగాలుగా విభజించనున్నారు.
ఉద్యోగుల భద్రతకు సంస్థ చర్యలు
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
రీజియన్ పరిధిలో డిపోల వారీగా తొలి విడతలో 6 వైద్య శిబిరాలు నిర్వహించారు. 3,210 మంది ఉద్యోగులు, సిబ్బందికి 17 రకాల పరీక్షలు చేశారు. ఫలితాల ఆధారంగా వారిని నాలుగు విభాగాలుగా విభజించనున్నారు. పూర్తి ఆరోగ్యవంతులు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండి వైద్యపరంగా అప్రమత్తంగా ఉన్నవారు, వైద్యం అవసరం ఉన్నవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిగా వర్గీకరించి చికిత్స అందించనున్నారు.
ఒత్తిడి అధిగమించేందుకు..:
ఇప్పటివరకు 400 మందికి బీపీ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 120 మందికి మధుమేహం ఉన్నట్లు చెబుతున్నారు. 22 మంది తీవ్ర హృదయ సంబంధ ఇబ్బందులకు గురవుతున్నట్లు తేలింది. ఉద్యోగులు ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని, తేలికపాటి నడక, జాగింగ్ వంటివి చేస్తే కొంత ఒత్తిడిని అధిగమించవచ్చని పేర్కొంటున్నారు.
మనుగడపై దృష్టి:
కొవిడ్ వేళ ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయింది. పాజిటివ్ కేసులు తగ్గాక కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి. ఏటా రీజియన్ పరిధిలో రూ.1.20 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.90 లక్షల నుంచి రూ.కోటి మేర సమకూరుతోంది. సిబ్బంది, ఉద్యోగులు బాగుంటేనే సంస్థ మనుగడ సాధ్యమని భావించి నూతన కార్యాచరణను అమలు చేస్తున్నారు.
పనిలో బిజీగా ఉండి..
లక్కు మల్లేశం, ఆర్టీసీ డీఎం
సంస్థ కోసం అహర్నిశలు పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చాలా మంది పని ఒత్తిడిలో ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలను అధిగమించేందుకు సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
[ 28-03-2024]
జహీరాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ మహారాజుల మురళి ఆధ్వర్యంలో భాజపా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి
[ 28-03-2024]
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. -
జీవశాస్త్రం పరీక్షకు 100 శాతం విద్యార్థుల హాజరు
[ 28-03-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా జీవశాస్త్రం పరీక్ష గురువారం నిర్వహించారు. -
మీ ఓటు ఉందా?
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కొన్ని రోజుల్లో హడావుడి మొదలవుతుంది. అధికారులు అంతా తీరిక లేకుండా ఉంటారు. ఇప్పుడు ఉన్న ఓటు అప్పుడు లేదంటే ఎవరూ పట్టించుకోరు. -
ఔషధ దుకాణాలపై నజర్
[ 28-03-2024]
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. -
సమృద్ధిగా జలం... ఆయకట్టుకు జీవం
[ 28-03-2024]
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల కింద నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. చేతికంది వచ్చిన పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అందరూ అనుకున్నట్లుగానే తాటిపర్తి జీవన్రెడ్డిని బరిలోకి దింపనుంది. ఈయన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం బుధవారం రాత్రి ఖరారు చేసింది. -
‘అవినీతికి చిరునామా కాంగ్రెస్’
[ 28-03-2024]
అవినీతికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని భారాస జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. భారాస జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. -
కొమ్మును కొట్టేస్తున్నారు!
[ 28-03-2024]
అత్యంత పవిత్రంగా భావించే పసుపు పంటను చోరీ చేస్తే ఏదీ కలిసిరాదంటారు. కానీ, నిత్యం నిఘా కెమోరాలు పనిచేసే చోట చోరీ జరుగుతోంది. బంగారంతో పోటీ పడుతున్న పసుపు కొనుగోళ్లు జరిగే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో. -
వలసలతో పరేషాన్..!
[ 28-03-2024]
కాంగ్రెస్లోకి వలసలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
డబ్బులు ఎప్పుడొస్తాయో..!
[ 28-03-2024]
‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్చేసుకున్నారు. -
టెట్కు సమాయత్తం
[ 28-03-2024]
సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!